/rtv/media/media_files/2025/04/07/365nYg3Pm4GtKaRH8IUm.jpg)
Stock Market Collapse
సోమవారం భారతీయ షేర్ మార్కెట్ భారీ నష్టాలు ఎదుర్కొంది. ఆరంభంలోనే సెన్సెక్స్ దాదాపు 4 వేల పాయింట్లు పతనమైంది. నిఫ్టీ దాదాపు 22 వేల దిగువకు పడిపోయింది. ఉదయం 11.20 AM గంటలకు సెన్సెక్స్ 2933 పాయింట్ల నష్టంతో 72,431 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 920 పాయింట్ల నష్టంతో 21,984 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.20 లక్షల కోట్ల వరకు ఆవిరైపోయింది.
అమెరికాలో మాంద్యం వస్తుందనే భయం నెలకొన్న నేపథ్యంలో కంపెనీల షేర్లలో భారీగా నష్టాలు వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 19 పైసలు తగ్గి 85.63 వద్ద కదలాడుతోంది. మెటలే రంగ షేర్లు 6.75 శాతం తగ్గాయి. రియాల్టీ రంగ షేర్లు 5.69, మీడియా సూచి 3.94, ఆటోమొబైల్ 3.78, ప్రైవేట్ బ్యాంక్ సూచి 3.47 శాతం తగ్గింది. అలాగే పీఎస్యూ బ్యాంక్ సూచి 2.84, ఫార్మా 2.75, ఐటీ 2.51 శాతం తగ్గింది. ఇక BSEలో ఉన్న సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ కొన్ని నిమిషాలలోనే ఏకంగా రూ. 12 లక్షల కోట్లు నష్టపోయింది.
Also Read: ''ట్రంప్ మాకొద్దు నీ కంపు''.. అమెరికా అంతటా పెద్ద ఎత్తున నిరసనలు
ట్రంప్ ప్రభుత్వం తమ టారిఫ్ల ప్రణాళికల నుంచి వెనక్కి తగ్గే సంకేతాలు లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లు క్షీణించిపోయాయి. ఆసియాతో పాటు, యూరప్, యూఎస్ మార్కెట్లలో కూడా భారీ నష్టాలు వచ్చాయి. ట్రంప్ 180 కన్నా ఎక్కువ దేశాలపై టారిఫ్లు విధించమే స్టాక్ మార్కెట్ల నష్టాలకు దారి తీశాయని నిపుణులు చెబుతున్నారు. భారతీయ మార్కెట్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మరింత తగ్గుదల ఉండొచ్చని అంటున్నారు.
2008 తర్వాత ఆసియాలో స్టాక్ మార్కెట్లు ఈ స్థాయిలో నష్టాలు చూడటం ఇదే మొదటిసారి. జపాన్ నిక్కీ ఓ దశలో ఏకంగా 8 శాతం వరకు పతనమైపోయింది. ప్రస్తుతం 6 శాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది. తైవాన్ సూచీ 9.61 శాతం, దక్షిణ కొరియా కోస్పి 4.14, చైనా షాంఘై సూచి 6.5 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచి 3.82 శాతం నష్టాల్లో ఉన్నాయి.
Also Read: నగరంలో 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కారులో తీసుకెళ్లి ఆ హోటల్లో అత్యాచారం!
అమెరికా ఫ్యూచర్ స్టాక్స్ సైతం నష్టాల్లో ఉన్నాయి. డోజోన్స్ 2.2 శాతం పడిపోయింది. సోమవారం ట్రేడింగ్లో అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యే ఛాన్స్ ఉంది. భారత గిఫ్ట్ నిఫ్టీ 900 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్స్ మూడున్నర శాతానికి పైగా కుంగింది. 2020 తర్వాత నిఫ్టీకి ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. కరోనా మహమ్మారి సమయంలో 2020లో మార్చి 23న సెన్సెక్స్ 4 వేల పాయింట్లు, నిఫ్టీ 1135 పాయింట్లకు పైగా నష్టపోయాయి.
stock-market | rtv-news