/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/RBI-Big-Update.jpg)
ఇండియా రద్దు చేసిన రూ.2వేల కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోట్ల ఇంకా పూర్తిస్థాయిలో రిజర్వ్ బ్యాంక్కు చేరలేదని పేర్కొంది. ప్రస్తుతం రూ.6,181 కోట్ల విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని RBI పేర్కొంది. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బ్లాక్ మనీ, అవినీతి, నకిలీ కరెన్సీకి అడ్డుకట్టలు వేసేందుకు కేంద్ర నోట్లను రద్దు ప్రకటించింది.
ప్రభుత్వం రూ.2వేల నోట్లను 19 మే 2023న ఆర్బీఐ రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వెనక్కి తీసుకున్న సమయంలో చెలామణిలో రూ.3.56లక్షల విలువ రూ.2వేల నోట్లు ఉన్నాయి. ఆ తర్వాత రూ.2000 నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం 2023 అక్టోబర్ 7 వరకు ఛాన్స్ ఇచ్చింది. అయితే, ఆర్బీఐ ఆఫీసుల్లో ఈ నోట్లను మార్చుకుని తమ అకౌంట్లల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఇప్పటికీ అవకాశం ఉందని.. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కేంద్ర కార్యాలయాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉందని చెప్పింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను రూ.2వేల నోట్లను పోస్టాఫీసుల్లోనూ మార్చుకోవచ్చని చెప్పింది.
announcement | currency-notes | reserve-bank-of-india | latest-telugu-news