RBI : వడ్డీ రేట్లు యథాతథమే..ఎలాంటి మార్పులు లేవు:ఆర్బీఐ గవర్నర్‌!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.రెపో రేటు ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తుంది.

New Update
Indian Rupee : ఇండోనేషియాలో కూడా మన రూపాయి.. కుదిరిన ఎంవోయూ!

విశ్లేషకులు ముందుగా  అంచనా వేసినట్లుగానే  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం నాడు ప్రకటించారు. రెపో రేటు ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తుంది.

Also Read:  Breaking: హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఒకరికి గాయాలు

ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వసారి కావడం గమనార్హం.డిసెంబర్‌ 4 నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది. ఈ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌నే నేడు వెల్లడించారు. ద్రవ్యోల్బణం,ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా వడ్డీ రేట్ల లో మార్పులు చేయోద్దని నిర్ణయించినట్లు తెలిపారు.

Also Read: Pushpa 2: చిరంజీవిని కలిసిన పుష్ప టీమ్‌ ..ఎందుకంటే!

ఈసారి స్థిర విధాన వైఖరిని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. 2024-25లో వాస్తవ జీడీపీ వృద్ది రేటు అంచనా6.6 శాతం.గత ద్వైమాసిక సమీక్షలో దీన్ని 7.2 శాతంగా అంచనా వేయగా...ప్రస్తుతం కాస్త తగ్గించాల్సి వచ్చింది. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ది రేటు అంచనాల కంటే తక్కువగా 5.4 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలు పెంపు. గతంలో దీన్ని 4.5 శాతంగా పేర్కొనగా..తాజాగా 4.8 శాతం ఉండొచ్చని తెలుస్తుంది.

Also Read: IND-PAK: సముద్రంలో నౌక మునక.. పాక్ సాయంతో..!

ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం అంచనాలను పెంచాల్సి వచ్చింది.2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ కరెంట్‌ ఖాతా లోటు స్థిరంగా ఉంటుంది.ద్రవ్యలభ్యత మిగులుస్థాయిలోనే ఉంది. బ్యాంకులు,బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బలంగా కొనసాగుతున్నాయి.

Also Read: AP: అన్నదాత సుఖీభవ...రైతుల అకౌంట్‌ లో రూ.20 వేలు!

ఆర్థిక రంగం  ఉత్తమంగా ఉంది. క్యాష్‌ రిజర్వ్‌ రేషియోను 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నాం.  బ్యాంకులకు రూ. 1.16 లక్షల కోట్ల నగదును అందుబాటులో ఉంచుతాం. రూపాయి విలువను బలోపేతం చేసేందుకు ఎన్‌ఆర్‌ ఐ డిపాజిట్ల పై వడ్డీ రేటు పరిమితిని పెంచుతున్నాం.

వ్యవసాయ రంగంలో తనఖా లేని రుణాలపరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచుతున్నామని ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు