/rtv/media/media_files/2024/12/06/A02pGmKFsrYVb6yJpw5w.jpg)
Megastar:ప్రస్తుతం భారతీయ చిత్ర సీమలో పుష్ప : ది రూల్ మూవీ హవా గట్టిగానే సాగుతుంది. జాతీయ నటుడు అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంపై సినీ ప్రియుల నుంచి ప్రముఖల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Ram Mohan Naidu: సుధామూర్తి అమ్మ ప్రేమ..ముగ్ధుడైన ఏపీ మంత్రి!
ఈ క్రమంలోనే 'పుష్ప 2' మూవీ చిత్ర బృందం, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. దర్శకుడు సుకుమార్, మైత్రీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి, సీఈవో చెర్రీలు చిరు నివాసానికి వెళ్లి కలిశారు.ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా 'పుష్ప 2' విశేషాలను చిరంజీవి చిత్ర బృందాన్ని అడిగి తెలుసుకున్నారు.
Also Read: AP: అన్నదాత సుఖీభవ...రైతుల అకౌంట్ లో రూ.20 వేలు!
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. పుష్ప 2ను తెరకెక్కించిన సుకుమార్, తన తర్వాతి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో చేయబోతున్నట్లు సమాచారం.
Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు
ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యేలోగా దర్శకుడు సుకుమార్ పూర్తి స్క్రిప్ట్ను రెడీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు.
Also Read: Bangladesh: జైళ్ల నుంచి 700 మంది పరారీ..బంగ్లాలో మరో కొత్త తలనొప్పి!
"గొప్ప పని కోసం శక్తిమంతమైన శక్తులు మళ్లీ కలుస్తున్నాయి" అంటూ గుర్రం బొమ్మ ఉన్న పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మరింత కలర్ ఫుల్ చేసేందుకు RC17 రానుందని తెలిపారు. గతంలో సుకుమార్ - చరణ్ కాంబోలో విడుదలైన 'రంగస్థలం' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.