/rtv/media/media_files/2024/12/06/jYChzQe1gt0t4y5H6Tow.jpg)
హైదరాబాద్లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బాంబు బ్లాస్ట్ జరిగింది. పోలీస్ స్టేషన్లో ఉన్న స్టోర్ రూమ్ వెనకాల చెత్త క్లీన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వీపర్కి స్వల్పంగా గాయాలు అయ్యాయి. అసలు బాంబు అక్కడికి ఎలా వచ్చింది? బాంబేనా లేకపోతే ఇంకా ఏదైనా పేలుడు సంభవించిందా? పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు గుడ్న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్
మోటారు సైకిల్లో గాలి నింపుతుండగా..
ఇదిలా ఉండగా ఇటీవల పంజాబ్లో అమృత్సర్లోని ఓ పోలీస్ స్టేషన్లో కూడా పేలుడు సంభవించింది. మోటారు సైకిల్లో గాలి నింపుతుండగా టైరు పేలింది. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదు. ఈ ప్రమాద ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. మనుషులు ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదు. పోలీస్ స్టేషన్ లోపల కూడా ఎలాంటి నష్టం జరగలేదు. కొందరు పోలీస్ స్టేషన్లో అద్దాలు పగుళ్లు వచ్చాయని అన్నారు. కానీ ఎలాంటి పేలుడు జరగలేదు. ఎలాంటి శబ్ధం కూడా రాలేదని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: రిక్టర్ స్కేల్పై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. ఎక్కడంటే?
ఇదిలా ఉండగా పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో కూడా కాల్పులు జరిగాయి. అమృత్సర్లోని సిక్కుల ప్రవిత్ర దేవాలయం గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం ముందు తపస్సు చేసుకుంటున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.
ఇది కూడా చూడండి: నేటి నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
బుల్లెట్ గురి తప్పి.. సుఖ్ బీర్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డాడు. రెండో రౌండ్ కాల్పులు చేయడానికి ప్రయత్నించిన దుండగుడిని సుఖ్ బీర్ సిండ్ అనుచరులు అడ్డుకున్నారు. సుఖ్ బీర్ సింగ్ మతపరమైన శిక్ష అనుభవిస్తూ.. సర్ణదేవాలయం ముందు సేవాదర్ విధులు నిర్వహిస్తున్నాడు. గోల్డెన్ టెంపుల్, ఇతర గురుద్వారాల ముందు పాత్రలు కడగడం, బూట్లు శుభ్రం చేస్తున్నాడు.
ఇది కూడా చూడండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు కోర్సులు