IND-PAK: సముద్రంలో నౌక మునక.. పాక్ సాయంతో..!

పోరుబందర్ పోర్టు నుంచి ఇరాన్‌కు బయలుదేరిన ఓ వాణిజ్య నౌకప్రమాదానికి గురై సముద్రంలోమునిగింది. అందులోని సిబ్బందిని పాక్‌ సెక్యూరిటీ సాయం తీసుకుని ముంబయిలోని మారిటైమ్‌ రెస్క్యూ కోర్డినేషన్‌ సెంటర్‌ ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారు.

New Update
sank

IND-Pak: అరేబియా సముద్రంలో మునిగిన ఓ వాణిజ్య నౌకలోని సిబ్బందిని రక్షించడం కోసం భారత కోస్ట్‌గార్డ్స్ దళం, పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ కలిసి ఆపరేషన్ నిర్వహించాయి. గుజరాత్‌లోని పోర్‌బందర్‌ నుంచి ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ పోర్టుకు వెళ్తోన్న వాణిజ్య నౌక ఎంఎస్వీ ఏఐ పిరాన్‌పిర్ అరేబియా సముద్రంలో  మునిగిపోయింది.ఈ ప్రమాదంలో అందులోని 12 మంది సిబ్బందిని భారత కోస్ట్‌గార్డ్స్ దళాలు రక్షించాయి. 

Also Read: తగ్గేదేలే.. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్.. డే 1 కలెక్షన్స్ ఎంతంటే!

ఇందుకు పాకిస్థాన్‌ మారిటైమ్‌ సెక్యురిటీ ఏజెన్సీ(పీఎంఎస్‌ఏ) కూడా సాయపడినట్టు అధికారులు చెప్పారు.‘ఎంఎస్వీ ఏఐ పిరాన్‌పిర్‌ అనే వాణిజ్య నౌక భారత్‌ జలాల వెలుపల, పాకిస్థాన్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ పరిధి సమీపంలో  నౌక మునిగిపోయింది. ప్రమాదం గురించి ముంబయిలోని మారిటైమ్‌ రెస్క్యూ కోర్డినేషన్‌ సెంటర్‌ కి  సమాచారం అందడంతో వెంటనే గాంధీనగర్‌లోని ఇండియన్ కోస్ట్‌గార్డ్స్‌ హెడ్ ఆఫీసును అప్రమత్తం చేసింది. వెంటనే  రంగంలోకి దిగిన ఐసీజీ.. ఘటన జరిగిన ప్రదేశానికి సార్థక్‌ నౌకను తిప్పింది.

Also Read: Bangladesh: జైళ్ల నుంచి 700 మంది పరారీ..బంగ్లాలో మరో కొత్త తలనొప్పి!

 ఆ ప్రాంతంలోని నావికులను అప్రమత్తం చేయాలని ఎంఆర్‌సీసీ.. పాకిస్థాన్‌ను సంప్రదించగా వారి సహాయపడ్డారు. అనంతరం ఓడ మునిగిపోయిన ప్రదేశానికి చేరుకుని, విస్తృత ఆపరేషన్‌ చేపట్టింది. నౌక నుంచి బయటపడి పాకిస్థాన్‌ రెస్క్యూ ప్రాంతంలో ద్వారకాకు 270 కిలోమీటర్ల దూరంలో చిన్న పడవలో ఆశ్రయం పొందుతున్న 12 మందిని గుర్తించి, వారిని రక్షించాం’ అని ఐసీజీ తన ప్రకటనలో వివరించింది.

Also Read: Ram Mohan Naidu: సుధామూర్తి అమ్మ ప్రేమ..ముగ్ధుడైన ఏపీ మంత్రి!

ఈ ఆపరేషన్ పూర్తైనంత వరకూ ఇరుదేశాల మారీటైమ్ రెస్క్యూ కో-ఆర్డినేషన్ సెంటర్లు నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. ప్రాణాలతో బయటపడినవారి అన్వేషణ కోసం పాకిస్తాన్ ఎంఎస్ఏ విమానం, ఎంవీ కాస్కో గ్లోరీ అనే వాణిజ్య నౌక సహకారం అందించాయని చెప్పింది. ఫార్వర్డ్ ఏరియా పెట్రోలింగ్ కోసం మోహరించిన ICGS సార్థక్.. ఘటన జరిగిన ప్రదేశానికి గరిష్ట వేగంతో వెళ్లి విస్తృతమైన ఆపరేషన్‌ చేపట్టింది.

Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు

 రక్షించిన సిబ్బందిని ICGS సార్థక్‌లోని వైద్య బృందం పరీక్షించి, వారు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపింది.వారిని తిరిగి గుజరాత్‌లోని పోర్‌బందర్ పోర్టుకు తీసుకుని వచ్చారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ ‘వయం రక్షమాః’ లేదా ‘మేము రక్షిస్తాం’ అనే నినాదాన్ని మరోసారి రుజువు చేస్తూ ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడంలో తన అంకితభావాన్ని చూపించింది.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు