/rtv/media/media_files/2025/04/24/nTGjUFvP2WqbXZB8m8nm.jpg)
marriage cancel
పహల్గామ్ ఉగ్రదాడితో ఓ పెళ్లి ఆగిపోయింది. రాజస్థాన్ కు చెందిన షాతన్ సింగ్ అనే వ్యక్తికి పాకిస్థాన్ కు చెందిన ఓ హిందూ యువతితో ఏప్రిల్ 24న పెళ్లి ఫిక్స్ అయింది. అయితే భారత్ తాజాగా పాక్ తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంది. దీంతో వాఘా- అట్టారి బార్డర్ మూసివేయగా అక్కడకు వెళ్లలేక పెళ్లి ఆగిపోయింది. కాగా పాక్ తో సరిహద్దు పంచుకునే రాజస్థాన్ గ్రామాల ప్రజలకు ఆ దేశంలో బంధువులున్నారు. నేటికీ వారు సంబంధాలు ఏర్పర్చుకుంటారు. అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ను వెంటనే మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిన్న అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం SVES వీసా కింద భారత్ లో ఉన్న ఏ పాకిస్తానీ పౌరుడైనా భారత్ ను విడిచి వెళ్ళడానికి 48 గంటల సమయం ఉంది.
#WATCH | Shaitan Singh, a Rajasthan citizen, who was scheduled to cross the Amritsar's Attari border to enter Pakistan for his wedding today, says, " What the terrorists have done is wrong...We are not being allowed to go (to Pakistan) as the border is closed...Let us see what… pic.twitter.com/FEEuf1GxZG
— ANI (@ANI) April 24, 2025