BIG BREAKING : సాయంత్రం 5 గంటలకు మీడియా ముందుకు మోదీ.. ఏం చెప్పబోతున్నారు?

మరికాసేపట్లో ప్రధాని మోదీ మీడియా ముందుకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  ఈ ప్రసంగంలో మోదీ ఏం మాట్లాడనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

New Update
Modi

మరికాసేపట్లో ప్రధాని మోదీ మీడియా ముందుకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  ఈ ప్రసంగంలో మోదీ ఏం మాట్లాడనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. నవరాత్రి సందర్భంగా ప్రధాని మోదీ ఈ ప్రసంగం ఉంటుంది.రాత్రి 12 తరువాత కొత్త జీఎస్టీ అమలులోకి రానుంది  తద్వారా అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. వీటి గురించి మోదీ మాట్లాడే అవకాశం ఉంది.

రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీపై వాషింగ్టన్ 50 శాతం సుంకాలు విధించడం, అందులో అదనంగా 25 శాతం లెవీ విధించడం వల్ల గత కొన్ని నెలలుగా అమెరికాతో భారత్  సంబంధాలు గడ్డకట్టిన సమయంలో ప్రధానమంత్రి ప్రసంగం రావడం గమనార్హం. 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై అమెరికా ఇతర దేశాలు ఆంక్షలు విధించాయి. దీనిపై కూడా మోదీ మాట్లాడే అవకాశం ఉంది.   విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం గురించి ఆయన ప్రస్తావించవచ్చు.

H1-B వీసా ఫీజులను పెంచడం

ఇటీవల అమెరికా H1-B వీసా ఫీజులను పెంచడం వంటి అంశాలపై కూడా ఆయన మాట్లాడవచ్చు. గతంలో కూడా ప్రధాని మోదీ పెద్ద నిర్ణయాలను ప్రకటించడానికి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు, గతంలో పెద్ద నోట్ల రద్దు, కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో. అందువల్ల, ఈ సాయంత్రం ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 

Also read : Asia Cup 2025: నేడే బిగ్ ఫైట్.. భారత్, పాక్ మ్యాచ్.. సూపర్ 4 మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే!

Advertisment
తాజా కథనాలు