BIG BREAKING : ప్రశాంత్‌ కిశోర్‌పై పరువునష్టం దావా

ప్రశాంత్ కిషోర్ కు బిగ్ షాక్ తగిలింది. తన కుమార్తెకు ఎంపీ టికెట్‌ కోసం కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశవాన్‌కు అశోక్‌ చౌదరీ లంచం ఇచ్చారని పీకే ఆరోపించారు. డబ్బులు ఇచ్చినట్లు నిరూపించాలని అశోక్‌ చౌదరీ సవాల్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పై పరువు నష్టం దావా వేశారు.

author-image
By Krishna
New Update
Prashant Kishor slapped with defamation suit

జన్ సూరజ్ పార్టీ  చీఫ్ ప్రశాంత్ కిషోర్ కు బిగ్ షాక్ తగిలింది. తన కుమార్తె శాంభవి చౌదరికి ఎంపీ టికెట్‌ కోసం కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశవాన్‌కు అశోక్‌ చౌదరీ లంచం ఇచ్చారని పీకే ఆరోపించారు. డబ్బులు ఇచ్చినట్లు నిరూపించాలని అశోక్‌ చౌదరీ సవాల్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పై మంగళవారం పరువు నష్టం దావా వేశారు.  ప్రశాంత్ కిషోర్ కు తాను లీగల్ నోటీసు పంపానని, దానికి సమాధానం వచ్చిందని, కానీ అది సంతృప్తికరంగా లేదని అశోక్ చౌదరి అన్నారు. ప్రశాంత్ కిషోర్ పై పాట్నా కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశానని చౌదరి తెలిపారు.

 

క్షమాపణలు చెప్పకపోతే

తాను ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, తన ప్రతిష్టను ఎవరూ ఇలా దిగజార్చలేరని వెల్లడించారు. ప్రశాంత్‌ కిషోర్‌ తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలైనా చెప్పాలి లేదంటే తనపై చేసిన ఆరోపణలు నిజమేనని రుజువైనా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రశాంత్ కిశోర్‌ తనకు క్షమాపణలు చెప్పకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తానని హెచ్చరించారు.  ప్రశాంత్ కిషోర్‌ను ఆయన రాజకీయ వ్యాపారవేత్తగా అభివర్ణించారు, ఆయన డబ్బు కోసం అన్ని పార్టీలకు పనిచేశారని చెప్పారు. కాగా  శాంభవి ప్రస్తుతం సమస్తిపూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌జన శక్తి పార్టీ ఎంపీగా ఉన్నారు. అశోక్ చౌదరి తండ్రి కాంగ్రెస్ హయాంలో బీహార్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 

Also Read :  సారీ చెప్పను, రిలీజ్ చేయను.. కమల్ హాసన్ సంచలన ప్రకటన

 

Advertisment
Advertisment
తాజా కథనాలు