/rtv/media/media_files/2025/06/03/V4rSI6XyjMyPtsosEtSe.jpg)
నటుడు కమల్ హాసన్ మరో సంచలన ప్రకటన చేశారు. తన రాబోయే తమిళ చిత్రం 'థగ్ లైఫ్' ను కర్ణాటకలో విడుదల చేయడం లేదని వెల్లడించారు. కన్నడ భాషపై తాను తప్పేం మాట్లాడలేదని, క్షమాపణ చెప్పేది లేదని తేల్చి చెప్పారు. అంతకుముందు తన సినిమాకు కన్నడలో ఎలాంటి ఆటకం కలగకుండా ఉండేలా చూడాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆయనపై అసహనం వ్యక్తం చేసింది. గత నెలలో తన సినిమా ప్రమోషన్ సందర్భంగా కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందనిఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.
Also read : వాట్సాప్ స్టేటస్ చూసి రెచ్చిపోయాడు.. 19 ఏళ్ల అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడు
🚨 Kamal Haasan on #ThugLife Ban in Karnataka :
— Venkatramanan (@VenkatRamanan_) June 3, 2025
“We won’t release the film in Karnataka for now. Apologies are for mistakes, not misunderstandings.”
🛑 Karnataka High Court has adjourned the matter to June 10 after Kamal refused to include an apology in his letter and withdrew… https://t.co/Nb5WsBBj9E pic.twitter.com/6Z6h3ngBoj
కేఎఫ్సీసీకి లేఖ
కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలను అక్కడి వారు అపార్థం చేసుకోవడం తనకు ఎంతో బాధగా ఉందన్నారు కమల్ హాసన్ తమిళ్, కన్నడ ప్రజలు ఒకే ఫ్యామిలీ అని చెప్పడమే తన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. కన్నడ భాషను తక్కువ చేయడం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ)కి లేఖ రాశారు. తన వలన శివన్న ఇబ్బందిపడడం విచారకరమని తెలిపారు. రాజ్కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని వెల్లడించారు.