PM Kisan : రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్‌ !

రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ 19వ విడుత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రిలీజ్ చేశారు.  దేశంలోని మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ. 22వేల కోట్లు జమ చేశారు.  

New Update
pm kisan

రైతులకు గుడ్ న్యూస్ ..  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడుత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రిలీజ్ చేశారు.  దేశంలోని మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ. 22వేల కోట్లు జమ చేశారు.  బీహార్‌లోని భాగల్పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ఈ నిధులను రిలీజ్ చేశారు.

అన్నదాతాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ అన్నదాతాల సంక్షేమానికి తమ ప్రభుత్వం  కట్టుబడి ఉందని తెలిపారు.  అనంతరం అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, వాటిని జాతికి అంకితం చేశారు.  కాగా పీఎం కిసాన్ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున మూడు వాయిదాలలో  రైతుల అకౌంట్లో  మొత్తం రూ.6 వేలు జమ అవుతాయి. ఈ నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమవుతాయి. ఈ పథకాన్ని కేంద్రం  2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది.  ఇప్పటివరకు18 విడతలుగా రూ. 3.46 లక్షల కోట్లకు పైగా 11 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రప్రభుత్వం.  

 పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలన్న లేకా పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది.  

Also read :  పాకిస్థాన్లో హై అలెర్ట్ :  ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. రంగంలోకి ఉగ్రవాదులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు