/rtv/media/media_files/2025/06/06/MP4TP8JeU7sxPuIE6oy7.jpg)
PM Modi to unveil world's highest railway bridge over River Chenab today
PM Modi Chenab Bridge: ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు(PM Modi Chenab Bridge Inauguration). పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్లో పర్యటించడం ఇదే మొదటిసారి. చీనాబ్ నదిపై ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జిని నిర్మించారు. 1315 మీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన( World’s Highest Railway Bridge India ) భారత్లో నిర్మించడం విశేషం.
RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండి..
— RTV (@RTVnewsnetwork) June 4, 2025
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్లో అప్డేట్చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ… pic.twitter.com/ImFUCn2AfR
Also Read: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఖలిస్థానీలు.. నినాదాలతో కలకలం
రూ.43,780 కోట్ల వ్యయంతో..
మరోవైపు కాట్రా శ్రీనగర్ మధ్య కూడా రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ రైలు ప్రారంభంతో కాట్రా శ్రీనగర్ మధ్య దూరం తగ్గనుంది. కేవలం 3 గంటల్లోనే ఈ రైలు గమ్యాన్ని చేరుకోనుంది. అలాగే భారత్లో తొలిసారిగా రూపొందించిన కేబుల్ రైల్వే బ్రిడ్జి అంజి వంతెనను కూడా మోదీ ప్రారంభించనున్నారు. రూ.43,780 కోట్ల వ్యయంతో ఉదంపూర్ శ్రీనగర్ భారముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు ప్రకటన కూడా ప్రధాని మోదీ చేయనున్నారు.
💠The architectural marvel Chenab Rail Bridge, situated at a height of 359 meters above the river, is the world's highest railway arch bridge. It is a 1,315-metre-long steel arch bridge engineered to withstand seismic and wind conditions
— PIB India (@PIB_India) June 5, 2025
💠A key impact of the bridge will be in… pic.twitter.com/V88ztShF8g
అలాగే సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కోసం వివిధ ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.350 కోట్లతో నిర్మించనున్న శ్రీమాతా వైష్ణో దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
Also Read: మహిళలు పొట్టి దుస్తులు వేసుకోవద్దు.. బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు