/rtv/media/media_files/2025/09/20/shyam-pitroda-2025-09-20-07-18-10.jpg)
భారతీయ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ విదేశాంగ విధానం మారాలని, అలాగే ఫస్ట్ పాకిస్థాన్పై దృష్టి సారించాలని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ను సందర్శించిన ప్రతిసారి తనకు సొంత ఇంట్లో ఉన్నట్లు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మూడు దేశాలు కొంతకాలం అలజడి తర్వాత పాలనాపరమైన మార్పులకు లోను కావడం ఆసక్తికరం. హింస, ఉగ్రవాదం వంటి సమస్యలు ఉన్నప్పటికీ పాక్, బంగ్లాదేశ్తో భారత్ చర్చలు జరపాలని పిట్రోడా సూచించారు.
“I've been to Pak, and I must tell you, I felt at home,” says Sam Pitroda.
— Shiv Aroor (@ShivAroor) September 19, 2025
Frankly hate such stories. But why does Pitroda always offer such moronic full-tosses to BJP, even if his point is nuanced? Damages his party every time he opens his mouth. pic.twitter.com/ZDbEdu8sIu
పాకిస్తాన్పై చేసిన 'పాకిస్తాన్ నాకు సొంత ఇల్లులా అనిపిస్తుంది' అనే వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన వెంటనే స్పందించి, తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని వివరించారు.
తాను పాకిస్తాన్ గురించి మాట్లాడింది రెండు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి చరిత్ర, ప్రజల మధ్య ఉన్న బంధాన్ని గురించి మాత్రమేనని పిట్రోడా స్పష్టం చేశారు. "నేను పొరుగు దేశాలను సందర్శించినప్పుడు నాకు 'సొంత ఇంట్లో' ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పినప్పుడు, సాంస్కృతికంగా, సామాజికంగా మనకు ఉన్న ఉమ్మడి మూలాలను నొక్కి చెప్పడమే నా ఉద్దేశం" అని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలు తీవ్రవాదం, సంఘర్షణలు లేదా భౌగోళిక రాజకీయ సవాళ్లను విస్మరించే ఉద్దేశంతో చేయలేదని ఆయన అన్నారు.
పిట్రోడా ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ, సామ్ పిట్రోడా వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇవి దేశ భద్రతకు సంబంధించిన విషయమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పట్ల మెతక వైఖరిని కలిగి ఉందని, రాహుల్ గాంధీ దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పిట్రోడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం భారత సైనికులను, ప్రజలను అవమానించడమేనని బీజేపీ ఆరోపించింది.
ఈ రాజకీయ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించలేదు. పిట్రోడా గతంలో చైనా, పన్నుల విధానం వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ తాజా వివాదం కాంగ్రెస్ పార్టీకి మరో ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది.