/rtv/media/media_files/2025/04/01/iogTz97rzAEatcfWWKhb.jpg)
nityananda no more
2019 నుంచి పరారీలో ఉన్న వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి తాజాగా వార్తల్లోకి ఎక్కారు. ఆయన చనిపోయినట్టు నిత్యానంద అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, దక్షిణ అమెరికాలోని బొలీవీయాలో అమెజాన్ అటవీ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించినట్టు ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అతడి అనుచరులు భూ ఆక్రమణకు ప్రయత్నించి... స్థానిక తెగలతో లీజుకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది.
Also Read: Ap Crime: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి!
ఈ విషయం వెలుగులోకి రావడంతో మొత్తం 21 మందిని అరెస్ట్ చేసిన బొలీవియా అధికారులు.. వీరందర్నీ వారి వారి దేశాలకు పంపించారు.భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద.. ఈక్విడార్ సమీపంలోని ఓ దీవికి కైలాస అనే పేరు పెట్టి అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. కైలాస దేశంతో సంబంధమున్న కొందరు ఇటీవల బొలీవియాలో పర్యటించి.. కార్చిచ్చును ఎదుర్కోవడంలో స్థానికులకు సాయపడ్డారు. ఈ క్రమంలో ఆ భూములపై కన్నేసిన వీరు.. లీజు కోసం స్థానిక తెగలతో ఒప్పందాలు చేసుకున్నారు.
Nithyananda Try To Land Grabbing
బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్తోనూ ఫొటోలు దిగారు. చివరకు 2 లక్షల డాలర్లకు ఢిల్లీకి మూడు రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉండే ప్రాంతాన్ని 25 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడానికి స్థానిక తెగ ప్రతినిధి ఒప్పుకున్నాడు. కానీ, నిత్యానంద ప్రతినిధులు మాత్రం వెయ్యేళ్లు లీజుతో పాటు గగనతల వినియోగం, సహజవనరులు, గనుల తవ్వకాలు వంటి ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై బొలీవియా వార్త పత్రిక ఒకటి ఇన్వెస్టిగేషన్ కథనం ప్రచురించడంతో నిత్యానంద కుట్ర బయటపడింది.
దీంతో అప్రమత్తమైన లూయిస్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కైలాసతో సంబంధమున్న 21 మందిని అదుపులోకి తీసుకుంది. వారు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి.. సంబంధిత వ్యక్తులను వారివారి దేశాలకు పంపేసింది. పర్యటకులుగా పలుసార్లు బొలీవియాకు వచ్చిన వీరు.. స్థానికులతో ఒప్పందాలు చేసుకున్నారని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. గతేడాది నవంబరు నుంచి కొందరు అక్కడే ఉండిపోయినట్టు గుర్తించామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బొలివియా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. వివాదాస్పద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో తమకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవని స్పష్టం చేశారు.
నిత్యానంద కైలాస ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్న తెగ నాయకుడు పెడ్రో గ్వాసికో మాట్లాడుతూ... 2024 చివరిలోనే భూముల లీజు గురించి తమను సంప్రదించారని తెలిపారు. కార్చిచ్చు ఆర్పేందుకు సాయం చేసినట్టే చేసి.. లీజు గురించి ప్రస్తావన తీసుకొచ్చారని చెప్పారు. ‘‘మేము వారి మాటలు విని మోసపోయాం.. మా భూమిని తీసుకుని ఏడాదికి కొంత మొత్తం ఇస్తామని ఆశ చూపించారు. కానీ అది పూర్తిగా తప్పు’’ అని తెలిపారు.
Also Read: Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. !
Also Read: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
nithyananda swami | swamy nityananda | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates