దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు..

దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. మొత్తం 22 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు విచారణలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

NIA
New Update

దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. మొత్తం 22 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు విచారణలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. మహారాష్ట్రలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గత నెల 20న పంజాబ్‌లోని 13 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. సెప్టెంబర్‌ 24న తమిళనాడులోని తాంబరం, పుదుక్కొట్టై, కన్యాకుమారి ప్రాంతాల్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేసింది.    

Also Read: అండర్‌ గ్రౌండ్‌ మెట్రో ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఎక్కడంటే ?

ఇదిలాఉండగా.. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఇప్పటికే లోక్‌సభ ఎంపీ ఇంజినీర్‌ రషీద్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 10న అతడు మధ్యంతర బెయిల్ పొందాడు. అయితే దాని గడువు అక్టోబర్ 2 నాటికి ముగిసింది. 2017లో టెర్రర్ ఫండింగ్‌ కేసులో రషీద్‌ను నిందితుడిగా గుర్తిస్తూ 2019లో ఎన్‌ఐఏ అతడిని అరెస్టు చేసింది. అలాగే కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు యాసిన్‌ మాలిక్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్, హిజ్బుల్‌ ముజాహిద్దీన్ చీఫ్‌ సయ్యద్ సలావుద్దీన్‌లపై ఛార్జీషీట్‌ దాఖలు చేశారు. అయితే మాలిక్‌ నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడికి 2022లో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. 

#telugu-news #nia #national
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe