ఇండియన్ నేవిలో పాక్ ఇన్‌ఫార్మర్.. అరెస్ట్

ఢిల్లీలోని నావల్ హెడ్ క్వార్టర్స్‌లో పని చేస్తున్న అప్పర్ డివిజన్ క్లర్క్ పాకిస్తాన్‌కు గూఢాచర్యం చేస్తూ పట్టబడ్డాడు. పాకిస్తాన్ నిఘా సంస్థకు రహస్య సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు బుధవారం విశాల్ యాదవ్‌ని అరెస్టు చేశారు.

New Update
Naval employee

ఢిల్లీలోని నావల్ హెడ్ క్వార్టర్స్‌లో పని చేస్తున్న అప్పర్ డివిజన్ క్లర్క్ పాకిస్తాన్‌కు గూఢాచర్యం చేస్తూ పట్టబడ్డాడు. పాకిస్తాన్ నిఘా సంస్థకు రహస్య సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు బుధవారం విశాల్ యాదవ్‌ని అరెస్టు చేశారు. సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ సమాచారాన్ని లీక్ చేశాడని యుడిసి విశాల్ యాదవ్ పై ఆరోపణలు ఉన్నాయి. పాక్‌కు గూడాఛర్యం చేసినందుకు అతను క్రిప్టో, బ్యాంక్ ద్వారా డబ్బలు తీసుకున్నాడు. విశాల్ యాదవ్ ఫోన్‌లో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన రక్షణ సమాచారం లీక్‌ అయ్యిందని తేలింది.

హర్యానాలోని రేవారిలోని పున్సిక నివాసి అయిన నిందితుడు విశాల్ యాదవ్‌ను 1923 అధికారిక రహస్యాల చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. విశాల్ యాదవ్ డైరెక్టరేట్ ఆఫ్ డాక్‌యార్డ్‌లో పనిచేస్తున్నాడు. ప్రియా శర్మ అనే ఫేక్ అకౌంట్‌లో పాకిస్తానీ మహిళా హ్యాండ్లర్‌తో సోషల్ మీడియాలో ఇన్‌ఫర్మేషన్ లీక్ చేశాడు. 

విశాల్ యాదవ్ ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసయ్యాడు. దీంతో అతని ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇండియన్ ఆర్మీ రహస్య సమాచారాన్ని లీక్ చేయడం ప్రారంభించాడని తేలింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో విశాల్ సున్నితమైన నావికాదళ నిఘా సమాచారాన్ని లీక్ చేశాడు. దానికి సంబంధించిన చాట్ రికార్డులు, డాక్యుమెంట్స్ అతని మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో బయపడ్డాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు