Bharat Bandh: జూన్ 10న భారత్ బంద్..!

కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ని నిరసిస్తూ జూన్ 10 (మంగళవారం) దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది ఆ పార్టీ. మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించనుంది.

New Update

మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ని నిరసిస్తూ జూన్ 10 (మంగళవారం) దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది మావోయిస్ట్ పార్టీ. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించనున్నారు. కేంద్రంతో మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్దమైయ్యారు. మావోయిస్టుల ప్రతిపాదనపై కేంద్రం స్పందించింది. 

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో ఈ నెల 21న భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశ‌వ‌రావు అలియాస్ బ‌స‌వ‌రాజు (67) కూడా ఉన్నారు. బ‌స‌వ‌రాజు ఉన్నార‌న్న స‌మాచారంతోనే మాధ్ ప్రాంతాన్ని భ‌ద్రతా బ‌ల‌గాలు చుట్టిముట్టి ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి.

ఇటీవల కేంద్రం యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కోసం ఆపరేషన్ కగార్‌ పేరుతో మావోయిస్టుల ఏరివేతను ప్రారంభించింది. ఛత్తీష్‌గడ్, దండకారణ్యం ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులను ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఆ పార్టీలో కీలక నేతలు హతమైయ్యారు. ఆపరేషన్ కగార్ ఆపి.. శాంతి చర్చలకు రావాలని కమ్యూనిస్ట్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

bharat-bandh | maoist-party | maoist nambala keshava rao | Nambala kesavarao | operation kagar | latest-telugu-news

 

Advertisment
Advertisment
తాజా కథనాలు