BREAKING: అరెస్ట్ వార్తలపై అఘోరీ, వర్షిణి స్పందించారు. తమ జోలికి ఎవరు రావొద్దని, తమను టచ్ చేయాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. 'మేం కేధర్నాథ్ వెళ్లిపోతున్నాం. జీవితాంతం అక్కడే ఉంటాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టం' అని తెలిపారు. అంతేకాదు దేశంలో వేరే సమస్యలు లేవా? అంతా తమపై పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రోల్ పోసుకుని చస్తాం..
ఈ మేరకు అఘోరీ మాట్లాడుతూ.. 'మా గురించి ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు. మా బతుకేదో మేము బతుకుతున్నాం. ఉత్తరాఖండ్ వెళ్లిపోతున్నాం. మా గురించి తప్పా వేరే విషయాలు దొరకట్లేదా. మీడియా మా వెంట ఎందుకు పడుతోంది. మా జోలికొస్తే పెట్రోల్ పోసుకుని మరణిస్తాం. కారుతో సహా సచ్చిపోతాం. రెండు ప్రాణాలు పోవడానికి మాపై ట్రోలింగ్ చేస్తున్నవారు, కేసులు పెడుతున్నవారు, విమర్శిస్తున్నవారు కారణం. ఆసత్య ప్రచారం ఆపండి. మమ్మల్ని ఎందుకు వెంటాడి వేధిస్తున్నారు. మీడియాలోనూ మా గురించి తప్పుగా ప్రచారం చేస్తే ప్రాణాలు వొదిలేస్తాం. మేము చెబుతున్నది 100 శాతం నిజం' అని చెప్పారు.
ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
ఇక మొదటిపెళ్లి గురించి మాట్లాడిన వర్షిణి.. అదంతా ఫేక్ అని కొట్టిపారేసింది. ఆధారాలు లేకుండా వచ్చి మొదటి భార్యను అని చెబితే ఎలా నమ్ముతున్నారని ప్రశ్నించింది. అఘోరికి నేనే మొదటి భార్యను. ఇంకెవరు లేరు. మేము ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటాం. దయచేసి మా దగ్గరకు రావొద్దని కోరింది. ఇక తనను బలి చేయబోతున్నారంటూ జరుగున్న ప్రచారం అంతా అబద్ధమని చెప్పింది. ఇక అఘోరి పేరు మీద డబ్బులు వేసిన వ్యక్తి కేసు పెడితేనే చెల్లుతుందని, ఎవరో పెడితే ఎందుకు కేసు అవుతుందని ప్రశ్నించింది.
ఇది కూడా చూడండి: AP: వైఎస్ జగన్కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్
మరోవైపు జోగినిలు కూడా అఘోరీపై మండిపడుతున్నారు. యోని పూజలు చేసి డబ్బులు వసూల్ చేసిందని, వ్యాపారులను కూడా నమ్మించి ముంచేసిందని ఆరోపిస్తున్నారు. ఇక వారు తెలుగు రాష్ట్రాల్లోకి రాగానే వారిద్దరిని అరెస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆశ్రమం పేరిట ఇప్పటికే లక్షల డబ్బులు వసూల్ చేశారని, మరిన్ని డబ్బులు కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
Aghori for Varshini | telugu-news | today telugu news