/rtv/media/media_files/2025/04/16/O6HSQGFcW7CEb76ST5Kw.jpg)
India's first train ATM installed on board Panchavati Express
రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్ప్రెస్లో ఓ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్కార్ కోచ్లో ఏర్పాటు చేశామని చెప్పారు.
Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు
త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫిసర్ స్వప్నిల్ నీలా తెలిపారు. కోచ్లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్ డోర్ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్ వర్క్షాప్లో చేశామని స్పష్టం చేశారు.
Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!
అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్ప్రెస్ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
telugu-news | national-news | trains