/rtv/media/media_files/2025/04/24/Kvm4X56Up0K4KHCGmvNF.jpeg)
ఇండియాపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడినప్పుడు ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్లో బుద్ధి చెబుతుంది. పాక్ తీవ్రవాద చర్యలకు చేతులు కట్టుకొని కూర్చునే ప్రస్తక్తే లేదనే భారత్ గతంలో రెండుసార్లు నిరూపించింది. పహల్గామ్ దాడికి కూడా ప్రతీకారం ఉంటుందని మోదీ చెప్పకనే చెప్పారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తమన్నారు. టెర్రరిజాన్ని మట్టికలిపేస్తామని శపదం చేశారు. 2016 సెప్టెంబర్ 18న యూరీ టెర్రర్ అటాక్కు బదులుగా పదకొండు రోజుల్లోనే సెప్టెంబర్ 29న సర్టిజికల్ స్ట్రైక్ చేసింది భారత్ ఆర్మీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని దాదాపు 35 మంది టెర్రిస్తులను మట్టుబెట్టింది. తర్వాత 2019 పుల్వామా అటాక్కు పాక్ చెంపపై కొట్టినట్టే 12 రోజుల్లోనే ఎయిర్ స్ట్రైక్ చేసింది. పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాదుల శిభిరాలపై నిప్పుల వర్షం కురిపించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఫస్ట్ టైం ఆర్మీని, సెకండ్ టైం ఎయిర్ ఫోర్స్ను స్ట్రైక్ కోసం వాడారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ కౌంటర్గా ఇప్పుడు మూడో సారి సర్జికల్ స్ట్రైక్ జరిగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిధ దళాల్లో నేవీతో ఈసారి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని భారత్ దెబ్బకొడుతుందా..? పహల్గామ్ పర్యటకుల దాడిలో ఓ నేవి ఆఫీసర్ చనిపోయాడు. ఈసారి నేవీతో స్ట్రైక్ చేయించి రక్షణ రంగంలో త్రివిధ దళాల పవర్ ఏంటో భారత్ చూపిస్తోందా??
సర్టికల్ స్ట్రైక్
సర్జికల్ స్ట్రైక్ అంటే ఒకరకమైన మిలిటరీ అటాక్. ఇందులో సైన్యం ముందుగా టార్గెట్ పెట్టుకున్న లక్ష్యాలను మాత్రమే ధ్వంసం చేస్తుంది. అది మనుషులు కావచ్చు, లేదా ఉగ్రవాద స్థావరాలు కావచ్చు. చుట్టుపక్కల పరిసరాలు, నివాస సముదాయాలు, వాహనాలు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి వాటికి సాధ్యమైనంత వరకు నష్టం వాటిల్లకుండా చూస్తుంది. ఈ తరహా దాడులను నిర్వహించడం కష్టంతో కూడుకున్నపని. దీనికి పక్కా ప్లానింగ్తోపాటు శత్రువుని కనురెప్ప పాటులో అంతం చేసే సైనికులు అవసరం. మెరుపు దాడులకు ట్రైనింగ్ అయిన కమాండోస్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీలో పారాషూట్ రెజిమెంట్కు చెందిన పారా కమాండోలు ఇలాంటి ఆపరేషన్లు చేపట్టడంలో సిద్ధహస్తులు. నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్కు చెందిన గరుడాలకు సర్జికల్ స్ట్రైక్స్ చేయడంలో ప్రావీణ్యం ఉన్న టీంలు.
2016లో యూరి ఉగ్రదాడికి ప్రతీకారం..
పంజాబ్లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ క్యాంప్లో 2016 జనవరి 2న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ జిహాద్ కౌన్సిల్కు చెందిన నలుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు. వైమానిక స్థావరంలోని సైనికులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఏడుగురు సైనికులు చనిపోయారు. మల్లీ టెర్రరిస్టులు అదే రీతిలో.. జమ్మూకశ్మీర్లోని యూరీ ప్రాంతంలో 2016 సెప్టెంబర్ 18న నలుగురు టెర్రరిస్టులు భద్రతా బలగాలపై దాడి చేశారు. దీన్నే యూరీ అటాక్ అని కూడా అంటారు. దీనికి సమాధానంగా ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది. దానికోసం ఆర్మీలో మెరుపు దాడుల్లో ఎక్స్పర్ట్స్ అయిన పారా కమాండోలను రంగంలోకి దింపింది. 2016 సెప్టెంబర్ 29న ఇండియా సర్జికల్ స్టైక్ చేసింది. పాకిస్థాన్ నియంత్రణ రేఖను దాటి వెళ్లి, ఉగ్రవాదులపై దాడి చేసింది. దాదాపు 35 నుంచి 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.
2019లో పుల్వామా అటాక్కు కౌంటర్
సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదుల ఆత్మహుతి దాడి జరిగింది. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యగా మళ్లీ ఇప్పుడు భారత్ సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఫిబ్రవరి 26న (మంగళవారం) తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్, పీఓకేలోని ముజఫర్బాద్, చికోటీలోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడిచేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీ ఉగ్రవాద శిక్షణ శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.