/rtv/media/media_files/2025/05/15/PW4GIckNijupUgHBAbGl.jpg)
DGMO Meeting
ఒక్క బుల్లెట్ కూడా పేల్చకూడదని...బోర్డర్ల నుంచి సైన్యాన్ని వెనక్కు మళ్లించాలని ఇరు దేశాల డీజీఎమ్వోలు నిర్ణయించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే కాశ్మీర్ లేదా సింధు జలాలపై ఒప్పందంపై ఎలాంటి చర్చలు జరగవని స్పష్టం చేసింది. మే 10, 12వ తేదీల్లో జరిగిన హాట్ లైన్ చర్చలపై ఇండియన్ ఆర్మీ ఇవాళ ప్రకటన చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. మే 10 శనివారం సాయంత్రం భూమి, వాయు, సముద్రంలో అన్ని కాల్పులు.. సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒప్పందం కుదిరింది. నాలుగు రోజులు తీవ్రమైన దాడుల తర్వాత రెండు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మే12న మధ్యాహ్నం నాలుగు గంటలకు డీజీఎమ్వోలు మళ్ళీ మాట్లాడుకున్నాయి.
భారతే గెలిచింది అంటున్న టామ్ కూపర్
భారత్ ఆపరేషన్ సిందూర్ లో పాక్, POKలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే దీనిపై ఆస్ట్రియన్ వార్ఫేర్ అనలిస్ట్ టామ్ కూపర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ అణు స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఓ నేషనల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడిలో పాకిస్థాన్ అణు స్థావరాలు ధ్వంసమయ్యాయి. అణు స్థావరాల ఎంట్రీ, ఎగ్జిట్లను భారత సైన్యం లేపేసింది. పాక్ వాళ్లు కూడా వాళ్ల అణు స్థావరాల్లోకి వెళ్లలేకపోతున్నారు. ఇండియా దెబ్బకు పాక్ గేమ్ఓవర్ అయ్యింది. వాళ్లు తమ అణు స్థావరాలు, ఎయిర్బేస్లను రక్షించుకోలేకపోయారు. దీన్నిబట్టి చూస్తే భారత్ గెలిచినట్లే కదా'' అని టామ్ కూపర్ అన్నారు.
today-latest-news-in-telugu | Indian Army | pakistan