/rtv/media/media_files/2025/05/06/ANfo8zzmySEo1ntklX81.jpg)
NOTAM
దేశంలో యుద్ధం తప్పదనేలా పరిస్థితులు మారుతున్నాయి. పాకిస్తాన్కు గట్టి కౌంటర్ ఇవ్వాలని భారత్ కోరుకుంటోంది. ఎప్పటి నుంచో ఉన్న జమ్మూ కశ్మీర్ సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటోంది. ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో రాజస్థాన్లో మే 7, 8 తేదీల్లో ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసాలు చేయనుంది. దీనికోసం భారతదేశం ఎయిర్మెన్ (NOTAM)కు నోటీసు జారీ చేసింది. సాధారణ కార్యాచరణ సంసిద్ధత విన్యాసాలలో భాగంగా IAF రాజస్థాన్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ విన్యాసాలు నిర్వహిస్తుంది.
🇮🇳🇵🇰 JUST IN: India has issued a NOTAM for a large section of airspace near the southern Pakistan border, effective from 3:30 PM (Delhi time) on April 7 and lasting 18 hours.
— MoLo44🎖️ (@MoloOSINT) May 6, 2025
❗Although a rendering error in the polygon shape in the image makes it appear as if the NOTAM crosses… pic.twitter.com/QALROyx8p8
నోటమ్ ప్రకారం.. ఈ ఎక్స్ర్సైజ్ మే 7న మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమై మే 8న రాత్రి 9:30 గంటలకు ముగుస్తుంది. ఇందులో రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్-30లు సహా అన్ని ఫ్రంట్లైన్ విమానాలు పాల్గొంటాయి. ఈ సమయంలో సరిహద్దుకు దగ్గరగా ఉన్న విమానాశ్రయంలో ల్యాండింగ్, టేక్కాఫ్లు నిలిపివేయబడతాయి. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ కూడా ఇండియా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహిస్తోంది. 1971లో పాక్తో యుద్ధం తర్వాత ఈ రకమైన పౌర రక్షణ సన్నాహాలు జరగలేదు.
( indian-air-force | rajasthan | latest-telugu-news)