BIG BREAKING: ఇండియాలో మరో హెలికాప్టర్ ప్రమాదం.. భారీగా మృతుల సంఖ్య..?

ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ వెళ్తున్న టూరిస్ట్ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని గౌరికుండ్ సమీపంలో కూలిపోయిందని పోలీసు అధికారులు ధృవీకరించారు.

author-image
By K Mohan
New Update
Helicopter Kedarnath

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్తున్న పర్యటకుల హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గౌరికుండ్ సమీపంలోని అడవుల్లో కూలిపోయిందని పోలీసు అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వారి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. పైలట్‌ కూడా సజీవదహనం అయినట్లు తెలుస్తోంది.

పలువురికి గాయాలైయ్యాయి. త్రిజుగినారాయణ్, గౌరికుండ్ మధ్య హెలికాప్టర్ సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. హెలికాప్టర్ దట్టమైన అడవి ప్రాంతంలో కూలిపోవడంతో రెస్క్యూ టీంకు అక్కడికి చేరుకోవడం కష్టమవుతుంది.

 గతవారం రోజుల క్రితం ఉత్తరాఖండ్ వెళ్తున్న హెలికాప్టర్ టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా హైవే రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరిచింది అందులో ఉన్న అందరి ప్రాణాలు కాపాడాడు. హైవే రోడ్డుకు ఇరు వైపుల ఉన్న దుకాణాలు, పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసమైయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు