/rtv/media/media_files/2025/06/15/RTT4zv4TNETyBurWA64R.jpg)
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి వెళ్తున్న పర్యటకుల హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గౌరికుండ్ సమీపంలోని అడవుల్లో కూలిపోయిందని పోలీసు అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వారి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. పైలట్ కూడా సజీవదహనం అయినట్లు తెలుస్తోంది.
🚨 #BREAKING : Another helicopter crash near #Kedarnath , incident reported near #Gaurikund
— Pragti Tripathi (@tripathi_pragti) June 15, 2025
A total of 5 people were onboard.
The helicopter belonging to Aryan Aviation has crashed due to bad weather conditions.
#HelicopterCrash #helicoptercrash
#rudraprayag #Uttarakhand… pic.twitter.com/Dkz3E1ISCX
పలువురికి గాయాలైయ్యాయి. త్రిజుగినారాయణ్, గౌరికుండ్ మధ్య హెలికాప్టర్ సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని హాస్పిటల్కు తరలిస్తున్నారు. హెలికాప్టర్ దట్టమైన అడవి ప్రాంతంలో కూలిపోవడంతో రెస్క్యూ టీంకు అక్కడికి చేరుకోవడం కష్టమవుతుంది.
గతవారం రోజుల క్రితం ఉత్తరాఖండ్ వెళ్తున్న హెలికాప్టర్ టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా హైవే రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరిచింది అందులో ఉన్న అందరి ప్రాణాలు కాపాడాడు. హైవే రోడ్డుకు ఇరు వైపుల ఉన్న దుకాణాలు, పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసమైయ్యాయి.