Old Woman Shows Aadhaar: రైలు ఎక్కిన బామ్మ..టికెట్‌ అడగగానే ఆధార్‌ చూపడంతో అందరూ షాక్..

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాయి. అందులో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాయి. కానీ ఓ వృద్దురాలు రైలులో కూడా ఉచిత ప్రయాణం అనుకుంది.

New Update
Free Bus scheme

Free Bus scheme

Old Woman Shows Aadhaar: ఎన్నికల్లో ఇచ్చిన హామీల నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాయి. అందులో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాయి. స్థానిక ఆధార్ కార్డు ఉన్న మహిళలు ఆధార్‌ చూపి రాష్ట్రం మొత్తం ఎంపిక చేసిన బస్సులలో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించారు. మహిళలు బస్సు ఎక్కి ఆధార్ కార్డు చూపిస్తే చాలు కండక్టర్‌  ఫ్రీ టికెట్ చేతికొచ్చేస్తారు. చిన్న పిల్లల దగ్గరినుంచి వృద్దుల వరకు అందరికీ ఈ  ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. ఎలాగు  ఫ్రీ కదా మహిళలు బస్సుల్లో జోరుగా ఖర్చు లేకుండా తిరిగేస్తున్నారు.  అయితే ఈ సౌలభ్యం కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. అది కూడా బస్సుల్లో మాత్రమే. కానీ, తాజాగా, ఓ వృద్ధురాలు రైలు ఎక్కింది. ఆమె ఎలాంటి టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంది. ఇంతలో టికెట్ కలెక్టర్ ఆమె దగ్గరకు వచ్చాడు.

ఆమె ముందు కూర్చుని అందరిని అడిగినట్లే ఆమెను కూడా టికెట్‌ చూపించమని అడిగాడు. ఆ వృద్దురాలు ఏ మాత్రం తడబడకుండా తన వద్ద ఉన్న ఆధార్‌ కార్డు తీసి అతడి చేతిలో పెట్టింది. ఒక్కసారిగా ఖంగు తిన్న ఆయనకు ఏ మాత్రం అర్థం కాలేదు. ‘ఏంటిది?’ అని అడిగాడు. ఇంతలో పక్కనే ఉన్న మహిళ కలగజేసుకుని ‘బస్సులో ఆధార్ కార్డు  చూపిస్తే ఫ్రీ టికెట్ ఇస్తున్నారు కదా.. అలానే రైలు టికెట్ కూడా ఇస్తారనుకుంటోంది’ అని అర్థం అయ్యేలా చెప్పింది. ఆ మాట విన్న అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. విషయం అర్థమై టీసీకి నవ్వు ఆగలేదు. ఆధార్ కార్డు వెనక్కు ఇచ్చేసి ‘రైలులో ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇవ్వరు. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే’ అని అర్థమయ్యేలా చెప్పాడు. అయితే ఆ బామ్మ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవా? తెలియదు. ఆ తర్వాత టికెట్‌ తీసుకుందా లేదా తెలియదు. 

Also Read: Bigg Boss 9 Telugu Thanuja Photos: మోడ్రన్ డ్రెస్‌లో తనూజ క్యూట్ ఫొటోలు.. కుర్రాళ్లను ఫిదా చేస్తున్న బ్యూటీ!

కానీ, అక్కడ జరిగిన తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దీన్ని సికందర్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశాడు. ‘రైలులో ప్రయాణం చేస్తూ టికెట్‌ కోసం ఆధార్ కార్డు చూపించిన బామ్మ. పాపం.. ఆ పెద్దావిడకు రైలులో ఆధార్ కార్డుతో ఫ్రీగా టికెట్ ఇవ్వరని తెలియదు కదా?. ఆ బామ్మ కల నెరవేరాలంటే రాహుల్ గాంధీ కానీ, సిద్ధరామయ్య కానీ, ప్రధాని కావాల్సిందే’ అని తన ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. అయితే, ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.

Also Read: AP Crime: మనసును కలచివేసే ఘటన... అనంతపురంలో వేడి పాల గిన్నెలో పడి బాలిక మృతి

Advertisment
తాజా కథనాలు