IST: కేంద్రం సంచలన నిర్ణయం.. అందరూ ఆ సమయాన్ని పాటించాల్సిందే!

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అధికారిక, వాణిజ్య రంగాల్లో ఒకేలా ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (IST)ను వినియోగించడాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
IST Time

IST Time

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అధికారిక, వాణిజ్య రంగాల్లో ఒకేలా ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (IST)ను వినియోగించడాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వినియోగదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14 వరకు ప్రజల అభిప్రాయాలను సేకరించనుంది. ఎవరైనా కూడా ఈ నిర్ణయంపై తమ అభిప్రాయాలను పంచకోవచ్చు. సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. 

Also Read: స్టార్‌లింక్‌ బీటా టెస్టింగ్ రేపే.. శాటిలైట్‌ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్‌

కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ప్రకారం.. కామర్స్, రవాణాశాఖ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లీగల్ కాంట్రాక్ట్స్, ఆర్థిక కార్యకలాపాలతో పాటు అన్ని రంగాలకు ఈ ఐఎస్‌టీ సమయాన్ని పాటించడం తప్పనిసరి చేస్తుంది. అధికారిక, వాణిజ్య పరంగా ఐఎస్‌టీ సమయ కాకుండా ఇతర సమయాన్ని పాటించడాన్ని నిషేధించడం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్‌స్టిట్యూషన్లలో తప్పనిసరిగా ఐఎస్‌టీ సమయాన్ని ప్రదర్శించడం లాంటి కీలక నిబంధనలు తాజాగా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలో ఉన్నాయి.  జాతీయ మౌళిక సదుపాయలు, టెలికమ్యూనికేషన్స్ బ్యాంకింగ్, డిఫెన్స్, 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లాంటి రంగాల్లో కచ్చితమైన సమయాన్ని పాటించాలనే ప్రయత్నంలో భాగంగానే తాజాగా ఈ ప్రతిపాదన వచ్చింది. 

స్ట్రాటాజిక్, నాన్ స్ట్రాటాజిక్ రంగాల్లో నానోసెకండ్ల కచ్చితత్వంతో సమయాన్ని పాటించడం అత్యంత అవసరమని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి అన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఖగోళ శాస్త్రం, నేవిగేషన్, శాస్త్రీయ పరిశోధన లాంటి ప్రత్యేకమైన రంగాలకు మాత్రం ఈ సమయ పాలనపై మినహాయింపు ఉండనుంది. 

Also Read: మా స్కీమ్స్‌తో ప్రతి ఇంటికి నెలకు రూ.25 వేల ప్రయోజనం: కేజ్రీవాల్‌

వినియోగదారుల వ్యవహారాల విభాగం.. నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ అండ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)తో కలిసి పటిష్టమైన సమయ విధానాన్ని, దానికి సంబంధించిన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయనుంది. ఎవరైన ఈ ఐఎస్‌టీ సమయ పాలనకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి జరిమానా కూడా ఉండనుంది. కేంద్రం తీసుకున్న ఈ డ్రాఫ్టింగ్ రూల్స్‌పై ఫిబ్రవరి 14 వరకు ప్రజలు దీనిపై సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వీటిని స్వీకరించనుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు