/rtv/media/media_files/2025/07/06/pm-kisan-2025-07-06-17-13-31.jpg)
PM Kisan Samman Nidhi
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడుతకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పీఎం కిసాన్ నిధులు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి రూ.171 కోట్ల తక్షణ సహాయం కింద జమ్మూ కాశ్మీర్లోని వరద బాధిత రైతులకు అందాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) కింద ప్రతి ఏడాది రూ.6000 చొప్పున రైతుల ఖాతాలో కేంద్రం జమ చేస్తోంది. ఇది మూడు దఫాల్లో విడుదల చేస్తారు. దీనికి ముందుగానే ఇకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. అయితే ఇప్పటివరకు 20 విడతల్లో నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 21వ విడుత నిధులను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇటీవల వరదల కారణంగా జమ్మూ కశ్మీర్లోని వరద ప్రభావిత ప్రాంత రైతులకు ముందుగానే రూ.171 కోట్లు తక్షణ సహాయ ప్యాకేజీని అందించింది. దీంతోపాటు సెప్టెంబర్ 26 న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ పీఎం కిసాన్ 21వ విడుత విడుదల చేశారు. మొత్తంగా 540 కోట్లు విడుదల చేయగా 2.7 మిలియన్ల పైగా రైతులకు లబ్ధి చేకూరింది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది రైతులకు తక్షణ సాయంగా ఈ నిధి ఉపకరిస్తుంది. అయితే ఈ రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో కూడా అతి త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడుత నిధులు విడుదల కానున్నాయి. అయితే ఈ నిధులు వీలయితే దీపావళి ముందుగానే లేకపోతే అక్టోబర్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.
అయితే రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే ముందుగానే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇది కామన్ సర్వీస్ సెంటర్ లేదా pmkisan.org.in అధికారిక వెబ్సైట్లో కూడా పూర్తి చేసుకోవచ్చు. దీంతో పాటు మీ ఆధార్ నంబర్ బ్యాంక్తో లింక్ చేసి ఉండాలి. మీ భూ రికార్డులు కూడా సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ పనులు పూర్తి చేయని రైతులు 21వ విడుత డబ్బులు పొందలేరు. కాబట్టి తమ స్టేటస్ ను కూడా ఆన్లైన్లో చెక్ చేసుకునే సదుపాయం కల్పించారు. అధికారిక వెబ్సైట్లో పీఎం కిసాన్ స్టేటస్ ని లబ్ధిదారుల చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రతి ఏడాది రూ.6000 కాగా వీటిని నాలుగు నెలలకు ఒకసారి మూడు దఫాల్లో విడుదల చేస్తారు. ఈ ఏడాది చివరి దఫా నిధులు ఈ నెలలో విడుదల కానున్నాయి. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 20 విడుతలుగా నిధులు దేశవ్యాప్తంగా విడుదల చేశారు. 21వ విడుదల విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇది కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే లభించే పథకం. ఆదాయ పన్ను చెల్లించేవారు అర్హులు కాదు. చిన్న సన్నకారు రైతులు మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: వీడు కొడుకు కాదు.. రాక్షసుడు.. ఆస్తి కోసం తల్లిని గొంతు నులుమి హత్య