/rtv/media/media_files/2025/05/09/MZbxjPj4vMKLni2zqk1J.jpg)
India Pakistan War 2025
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు బాగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భారత దౌత్యవేత్తల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్కు, దౌత్యవేత్తల నివాసాలకు వార్తాపత్రికలు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాను పాకిస్తాన్ నిలిపివేసింది. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య సంప్రదాయాలు ఉల్లంఘించబడ్డాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యలను చిన్నపాటి ప్రతికారంగా భారత మీడియా అభివర్ణించింది. అదే సమయంలో పాకిస్తాన్ భారత దౌత్యవేత్తలపై నిఘాను కూడా పెంచిందని సమాచారం. భారత దౌత్యవేత్తల కార్యకలాపాలను నిశితంగా గమనించడానికి అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి దౌత్యవేత్తల సెక్యూరిటీ, ఫ్రీడమ్కు ఆటంకం కలిగిస్తోంది. గతంలో కూడా ఇరు దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దౌత్యవేత్తలను వేధించడం, వారి పనులకు ఆటంకం కలిగించడం వంటివి అప్పుడు కూడా జరిగాయి.
Stung by OpSindoor & global humiliation, Pakistan hits new low!
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 11, 2025
In a brazen breach of Vienna Convention, Islamabad blocks water, gas & newspapers to Indian diplomats — petty ISI-orchestrated retaliation after India’s decisive moves, including suspending the Indus Water Treaty… pic.twitter.com/phl2HkDKjh
భారత్ కూడా దీనికి ప్రతిస్పందనగా చర్యలు తీసుకుంది. ఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్యవేత్తలకు వార్తాపత్రికల సరఫరాను నిలిపివేసింది. అయితే, దౌత్య సంబంధాలు, సంప్రదాయాలను కాపాడాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. కానీ పాకిస్తాన్ చర్యలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పహెల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాతే ఈ దౌత్యపరమైన వివాదం మరింత ముదిరింది. ఈ తాజా పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత క్లిష్టం చేసే అవకాశం ఉంది.
#BREAKING: Pakistan Government has stopped newspapers supply to Indian High Commission, Islamabad for Indian Diplomat since June after facing crushing embarrassment in #OperationSindoor. India in tit for tat retaliation had stopped supply of newspapers at Pak Mission in Delhi. pic.twitter.com/CSbN9aj836
— Sood Saab (@SoodSaab11) August 11, 2025