/rtv/media/media_files/2025/07/03/national-herald-case-2025-07-03-14-52-43.jpg)
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని.. దాదాపు రూ.2 వేల కోట్ల మనీలాండరింగ్ జరిగిందంటూ ఈడీ అభియోగం మోపింది. ఈ క్రమంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ సహా తదితరులపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్షీట్లో ఈడీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీని నుంచి రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా వారు పొందారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.