కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం!!

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ED పిటిషన్‌ వేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్‌ సహా తదితరులపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 

New Update
National Herald case

నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని.. దాదాపు రూ.2 వేల కోట్ల మనీలాండరింగ్ జరిగిందంటూ ఈడీ అభియోగం మోపింది. ఈ క్రమంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్‌ సహా తదితరులపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 
యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్‌షీట్‌లో ఈడీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీని నుంచి రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా వారు పొందారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు