/rtv/media/media_files/2025/03/26/C5RDCXlqrOJEh2QQ2ikY.jpg)
chhattisgarh cbi searching in ex cm bupesh house
ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఇవాళ ఆయన ఇంట్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రాయ్పూర్, బిలాయ్లోని భూపేశ్ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 10న బఘీల్ ఇంటిపై ED రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు ఇదే విషయంపై భూపేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
Also Read : ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?
ఇటీవల సోదాలు
ఇటీవల ఇదే కేసుకు సంబంధించి భూపేశ్ బాఘేల్, ఆయన కుమారుడు చైతన్య బాఘేల్ ఇంటితో సహా మరో 14 ప్రదేశాలలో సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. దుర్గ్ జిల్లాలోని భిలాయ్లోని చైతన్య బాఘేల్ నివాసాలు, ఆయన సన్నిహితుడిగా చెప్పబడుతున్న లక్ష్మీ నారాయణ్ బన్సాల్ అలియాస్ పప్పు బన్సాల్, మరికొన్ని స్థలాలను కూడా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల కింద సోదాలు చేసిన విషయం తెలిసిందే.
Also Read: పోలీసుస్టేషన్ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్!
ఆ సోదాలలో భాగంగా దాదాపు రూ.30 లక్షల నగదు, పలు డాక్యుమెంట్స్ను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ తనిఖీల అనంతరం తిరిగివెళ్లిపోతున్న ఈడీ అధికారుల వాహనాలపై కార్యకర్తలు, నిరసనకారులు రాళ్లు రువ్వడంతో హైటెన్షన్ చోటుచేసుకుంది.
Also Read : ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!
గతంలో ఆరోపణలు
ఛత్తీస్గఢ్లో బాఘెల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు 2019, 2022 మధ్య మద్యం కుంభకోణం కుట్రపూరితంగా జరిగిందని గతంలో ED ఆరోపించింది. అంతేకాకుండా మద్యం కుంభకోణం ద్వారా దాదాపు రూ.2,100 కోట్లకు పైగా నేర ఆదాయం వచ్చిందని ED ఆరోపణలు చేసింది.
ఈ దర్యాప్తులో భాగంగా జనవరిలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు కవాసి లఖ్మాతో పాటు రాయ్పూర్ మేయర్, కాంగ్రెస్ నాయకుడు ఐజాజ్ ధేబర్ అన్నయ్య అన్వర్ ధేబర్, మాజీ IAS అధికారి అనిల్ తుటేజా, ఇండియన్ టెలికాం సర్వీస్ (ITS) అధికారి అరుణ్పతి త్రిపాఠి, మరికొందరిని ఏజెన్సీ అరెస్టు చేసింది.
"The CBI has come. Former Chief Minister Bhupesh Baghel is scheduled to go to Delhi today for the meeting of the Drafting Committee constituted for the AICC meeting to be held in Ahmedabad (Gujarat) on 8th and 9th April. Before this, the CBI has reached Raipur and Bhilai… https://t.co/BDRbVly6q7 pic.twitter.com/bVQ86ylgse
— ANI (@ANI) March 26, 2025
Also Read : రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి
latest-telugu-news | bhupesh-bagel-news | bhupesh-bagel | today-news-in-telugu | national news in Telugu