Betting Apps: సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన బెట్టింగ్ యాప్స్..యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి ఆస్తుల జప్తు

భారత్ లో బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీల పరువు తీస్తున్నాయి. వీటి కారణంగా సినిమా సెలబ్రిటీలు కేసులు, విచారణలు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు పలువురు బాలీవుడ్, క్రికెటర్ల ఆస్తులను కూడా జప్తు చేసిన ఈడీ.

New Update
betting app

బెట్టింగ్ యాప్ కేసును ఈడీ సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ఈడీ కోట్లాది రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటూ క్రికెటర్లు కూడా ఉన్నారు. యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, ఉర్వశిరౌతేలా, సోనూసూద్, మిమీ చక్రవర్తి, అంకుష్హజ్రా, నేహా శర్మల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

19.07 కోట్ల ఆస్తుల జప్తు..

ఈడీ మొత్తం 7.93 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో యువరాజ్ సింగ్ - 2.5 కోట్లు, రాబిన్ ఉతప్ప - 8.26 లక్షలు, ఉర్వశిరౌతేలా - 2.02 కోట్లు, సోనూసూద్ - 1 కోటి, మిమీ చక్రవర్తి - 59 లక్షలు, అంకుష్హజ్రా - 47.20 లక్షలు, నేహా శర్మ - 1.26 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంతకు ముందు ఇదే కేసులో క్రికెటర్ శిఖర్ధావన్ ఆస్తులకు సంబంధించి 4.55 కోట్ల రూపాయలను జప్తు చేసింది. ఈ కేసులో ధావన్ విచారణను కూడా ఎదుర్కొన్నారు. అలాగే సురేష్ రైనా ఆస్తులలో 6.64 కోట్ల రూపాయలను కూడా అటాచ్ చేసింది. ఇప్పటివరకు 1x బెట్ కేసులో ఈడీ 19.07 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇందులో మరింత మంది పేర్లు బయటకు రావొచ్చని చెబుతున్నారు.

అసలేంటీ కేసు..

1xBet, దాని ఇతర బ్రాండ్లు 1xBat, Sporting Lines మన దేశంలో ఎటువంటి అనుమతి లేకుండా ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా దీని బండారం బయటపెట్టింది ఈడీ. దాంతో పాటూయాప్ కోసం ఎవరెవరు సెలబ్రిటీలు పని చేశారనే దానిపై కూడా ఫోకస్ చేసింది. సెలబ్రిటీలు విదేశీ కంపెనీలతో ఎండార్స్‌మెంట్ అంటే ప్రకటనల ఒప్పందాలు చేసుకున్నారని, 1xBet ప్రమోషన్ కోసం వీడియోలు, సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ప్రకటనలు చేశారని దర్యాప్తులో తేలింది.

ఇక యాప్ విషయానికి స్తే.. బెట్టింగ్ ల ద్వారా వచ్చిన చెల్లింపులు నేరుగా భారత్ లో కాకుండా, అసలు మూలాన్ని దాచిపెట్టడానికి విదేశీ మార్గాల ద్వారా మళ్లించారు. ఈడీ ప్రకారం, ఈ డబ్బు అక్రమ బెట్టింగ్ ద్వారా సంపాదించిన డబ్బు, దానిని చట్టబద్ధం చేయడానికి ఈ ఒప్పందాలు చేసుకున్నారు. 1xBet భారతదేశంలో బెట్టింగ్ కోసం వేలాది నకిలీ లేదా ఇతరుల పేర్లతో ఖాతాలను ఉపయోగించినట్లు తేలింది. ఇలాంటి వాటిని ఇప్పటివరకు 6000కు పైగా ఇలాంటి ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాలలో బెట్టింగ్ డబ్బు జమ చేశారు, ఆపై డబ్బును ట్రాక్ చేయకుండా ఉండటానికి చాలాసార్లు వివిధ చెల్లింపు గేట్‌వేల ద్వారా బదిలీ చేశారు. ఈడీ దేశంలో నాలుగు గేట్ వేలపై దాడులు నిర్వహించింది. అలాగే 60 బ్యాంకు ఖాతాలను కూడా బ్లాక్ చేసింది ఈడీ. దీని ద్వారా నాలుగు కోట్ల రూపాయలను నిలిపేశారు.

Advertisment
తాజా కథనాలు