/rtv/media/media_files/2025/05/16/qp42SmwFlI3sQvXGUcP5.jpg)
pm-modi-indian-army
ఆపరేషన్ సిందూర్ ఫలితంగా భారత రక్షణ బడ్జెట్ మరో రూ.50,000 కోట్లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రక్షణ రంగంలో భారత్ను మరింత పటిష్టం చేసేందుకు మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఆర్మీకి కొత్త వెపన్స్, మందుగుండు సామాగ్రి కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. బడ్జెట్లో రక్షణ రంగానికి నిధులు పెంపు దిశగా మోదీ సర్కార్ సమాలోచలు చేస్తుంది. రక్షణ రంగానికి మరో రూ.50 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు నుంచి సమాచారం అందుతోంది. ఈ పెంపుదల ఆమోదం పొందితే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రక్షణ శాఖకు కేటాయింపులు రూ.7 లక్షల కోట్లకు మించిపోతాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బడ్జెట్ కు ఆమోదం కోరే అవకాశం ఉంది.
India’s #DefenceExports surged from Rs 686 crore in 2013-14 to Rs 23,622 crore in 2024-25, a 34-fold increase. In 2024-25, private sector exports were Rs15,233 crore, and DPSUs Rs 8,389 crore, with DPSU exports growing 42.85%. Export authorisations rose by 16.92%, and exporters… pic.twitter.com/yDVYAwajxG
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 13, 2025
రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్లు
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025/26 బడ్జెట్లో సాయుధ దళాల కోసం రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 9.53% ఎక్కువ. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖపై దృష్టి సారించింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014/15లో రక్షణ మంత్రిత్వ శాఖకు రూ. 2.29 లక్షల కోట్లు కేటాయించారు. గత దశాబ్దంలో ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ. ప్రస్తుత కేటాయింపు అన్ని మంత్రిత్వ శాఖలలోకి రక్షణ శాఖకే అత్యధికంగా కేటాయించారు. ఇదిమొత్తం బడ్జెట్ లో 13 శాతం అన్నమాట.
pm-narendra-modi | Indian Army | union-budget | telugu-news