Aircraft Accidents: భారత్‌లో ఘోర విమాన ప్రమాదాలు.. ఇప్పటివరకు ఎంతమంది మరణించారంటే?

గుజరాత్‌ అహ్మదాబాద్‌ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి గురువారం లండన్‌ బయల్దేరిన ఫ్లయిట్‌ ఏఐ-171 టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాలకే కుప్పకూలింది. ఈ సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది.

New Update
Air India: సిక్‌ లీవ్ పెట్టిన సిబ్బంది..నిలిచిన 70 ఎయిర్‌ ఇండియా విమానాలు!

Aircraft Accidents

 Aircraft Accidents:  రోడ్డుపై వెళ్తే ఎదురుగా ఏదో వాహనం వచ్చి ఢీకొంటే ప్రమాదం జరగవచ్చు. రైలులో వెళితే పట్టాలపై ఎదురెదురుగా రైళ్లు ఢీ కొని ప్రమాదం సంభవించవచ్చు. కానీ విమానంలో వెళ్తే సురక్షితం అనుకునే వాళ్లు కూడా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి. ఈ రోజు జరిగిన విమాన ప్రమాదంలో వందలాది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి గురువారం లండన్‌ బయల్దేరిన ఫ్లయిట్‌ నెంబర్‌ ఏఐ-171 విమానం టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాలకే కుప్పకూలింది. ఈ సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది.  విమానం ఒక మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనం పైన పడటంతో  అందులో ఉన్న పలువురు మరణించినట్లు తెలుస్తోంది. కాగా గడచిన ఐదేండ్లలో మనదేశంలో జరిగిన ప్రమాదాలు, అందులో మరణించిన వారిని గురించి ఒకసారి గమనిస్తే వాటన్నింటిలో ఇదే పెద్ద ప్రమాదమని తెలుస్తోంది.   


ప్రమాదాలు-- మరణాలు


2020లో సంభవించిన కరోనా మహమ్మారి మూలంగా  విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యే ఆపరేషన్‌ చేపట్టింది. అందులో భాగంగా బోయింగ్ 737-800 విమానం దుబాయ్‌ నుంచి కేరళలోని కొయ్‌కోడ్‌కు బయలుదేరింది. అయితే ఆ సమయంలో భారీ వర్షం కారణంగా విమానం ప్రమాదానికి గురైంది. విమానం30 అడుగుల లోయలో పడి రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు 21 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 

ఇక 2010 మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ప్రమాదానికి గురైంది.  ఐఎక్స్‌-812 విమానం భారీ ప్రమాదానికి గురికావడంతో166 మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం సకాలంలో రన్‌వేపై ఆగలేకపోయింది. రన్‌వే దాటి లోయలోకి దూసుకెళ్లడంతో విమానంలో  మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఉన్న 158 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.  

ఆలయన్స్‌ ఎయిర్‌ ఫ్లైట్‌ బోయింగ్ 737-2A8 బిహార్‌లోని పట్నా విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో అదుపు తప్పిన ఘటన 1998 జులైలో చోటు చేసుకుంది. దీంతో జనాలు ఉన్న పాంత్రంలోకి విమానం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న55 మంది ప్రయాణికులతో పాటు  ఐదుగురు స్థానికులు చనిపోయారు.

1996 హరియాణాలో  ఘోర విమాన ప్రమాదం జరిగింది. కజికిస్థాన్ ఎయిర్‌లైన్స్ విమానం 1907తో సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ విమానం 763 విమానం ఢీకొన్నాయి. సమాచారం లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండు విమానాల్లో 340కి పైగా మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం చెందారు.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో 1993 ఏప్రిల్‌లో  మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఔరంగాబాద్‌ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం టేకాఫ్‌ సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో  రన్‌వేపైకి వచ్చిన ట్రక్కును ఢీకొనడంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులు, 55 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 

 1990 లో బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 605 కుప్పకూలింది. విమానం రన్‌వేను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 146 ప్రమాణికులు, 92 మంది సిబ్బంది చనిపోయారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు