PM Modi: విదేశీ పాడ్‌కాస్ట్‌లో మోదీ.. కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

అమెరికాకు చెందిన ఏఐ పరిశోధకుడు లెక్స్‌ ఫ్రిడ్‌మాన్‌.. భారత ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశీ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ సౌకర్యంగా కూర్చోని ఉంటారంటూ కాంగ్రెస్‌ ఎక్స్‌ వేదికగా సెటైర్లు వేసింది.పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
PM Modi

PM Modi

అమెరికాకు చెందిన అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ పరిశోధకుడు లెక్స్‌ ఫ్రిడ్‌మాన్‌.. భారత ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాని.. పాకిస్థాన్‌తో వైరం, ప్రజాస్వామ్యం లాంటి వివిధ అంశాల గురించి మాట్లాడారు. అయితే ఈ ఎపిసోడ్‌పై తాజాగా కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేసింది. విదేశీ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ సౌకర్యంగా కూర్చోని ఉంటారంటూ సెటైర్లు వేసింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎక్స్‌లో దీనిపై స్పందించారు. 

Also Read: మాజీ అనొద్దు ఫ్లీజ్‌..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు

'' భారత్‌లో మీడియాతో మాట్లాడేందుకు భయపడే ఆయన రైట్‌వింగ్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుచేసిన పాడ్‌కాస్ట్‌లో సౌకర్యంగా కూర్చొని ఉంటారు. జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన సంస్థలను తనపై విమర్శలు చేసేవారిపై ప్రతీకారంగా వాడుతున్న వ్యక్తి.. విమర్శ ప్రజాస్వామ్యానికి ఆత్మ అని చెప్పడం విడ్డూరం. ఆయన చెప్పిన మాయమాటలకు హద్దు లేకుండా పోయిందని'' కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌'' ఎక్స్‌లో విమర్శలు చేశారు.

ఇదిలాఉండగా.. లెక్స్‌ ఫ్రిడ్‌మాన్‌ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ దాదాపు 3 గంటల సేపు మట్లాడారు. '' విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ. విమర్శలను నేను స్వాగతిస్తాను. కానీ అవి మరింత పదునుగా ఉండాలి. పేరులో నా శక్తి లేదు. 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలోనే ఉంది. ప్రపంచ నేతలతో నేను చేయి కలిపితే అది మోదీ చేస్తుంది కాదు. 140 కోట్ల మంది భారతీయులు చేస్తున్నట్లే. 

Also Read: భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్‌.. టైమ్‌ చెప్పిన నాసా

శాంతి గురించి మేము మాట్లాడినప్పుడు ప్రపంచం మా మాట వింటుంది. ఎందుకంటే గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ వంటి వారు పుట్టిన నేల ఇది. నా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి పాకిస్థాన్‌ను ఆహ్వానించాను. కానీ శాంతి కోసం ప్రయత్నం చేసిన ప్రతిసారి మాత్రం శత్రుత్వం, ద్రోహమే ఎదురైంది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచేందుకు ఇస్లామాబాద్ నాయకత్వంపై ఆధారపడి ఉంది. నాపై చేసే విమర్శలను స్వాగతిస్తాను. అది ప్రజాస్వామ్యం ఆత్మ అని నేను నమ్ముతానని'' మోదీ అన్నారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు