CM Atishi: సీఎం అతిషికి 4 గంటల్లోనే రూ.10 లక్షలు విరాళం

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం కావాలని సీఎం అతిషి క్రౌడ్‌ ఫండింగ్‌ను ప్రారంభించారు. ఇది ప్రారంభించిన 4 గంటల్లోనే ఆమెకు రూ.10,32000 విరాళాలు వచ్చాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
CM Atishi

CM Atishi

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. సీఎం అతిషి మళ్లీ కాల్కాజీ స్థానం నుంచి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె ప్రజలనే ఆర్థిక సాయం కోరారు. ఇందుకోసం రూ.40 లక్షలు అవసరమవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే  తాజాగా క్రౌఢ్‌ ఫండింగ్‌ను ప్రారంభించారు. తనకు ఆన్‌లైన్‌లో విరాళాలు ఇచ్చేందుకు ఓ లింక్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ క్రౌడ్ ఫౌండింగ్‌ ప్రారంభించిన 4 గంటల్లోనే అతిషికి రూ.10,32000 విరాళాలు వచ్చాయి. ఇప్పటివరకు ఆమెకు 176 మంది దాతలు విరాళం ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు.  

Also Read: మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు రూ.8,500: కాంగ్రెస్

ఈ సందర్భంగా సీఎం అతిషి మాట్లాడారు. '' ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేశారు. మాకు విరాళాలు అందజేశారు. చిన్న చిన్న విరాళాలు కూడా మాకు ఎన్నికల్లో పోరాడి గెలిచేందుకు సాయపడతాయి. పేద ప్రజలు కూడా రూ.10 నుంచి 100 వరకు తమకు  తోచినంత సాయం సాయం చేశారు. ఆప్‌ నిజాయతీ రాజకీయాలపై ప్రజలు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. మేము కార్పొరేట్ల నుంచి ఆర్థిక సాయం కోరడం లేదు. అసలు సమస్య ఏంటంటే సాధారంగా పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు బడా వ్యాపారవేత్తల నుంచి విరాళాలు సేకరిస్తారు. ఎన్నికల్లో గెలిచాక కాంట్రాక్టుల రూపంలో వారి కోసం సాయం చేస్తుటారు. కేజ్రీవాల్ ప్రభుత్వం మాత్రం సాధారణ ప్రజల కోసమే పని చేసిందని'' అతిషి తెలిపారు.     

Also Read: అంతరిక్షంలో మరో అద్భుతం సృష్టించిన ISRO.. ఇండియా ఘనత

ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. 2015, 2020 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన ఆప్ హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 83,49,645 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 71,73,952. థర్డ్ జెండర్ల 1,261 మంది ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు