/rtv/media/media_files/2025/06/10/TOhd2iRehN2pjQWXFOk1.jpg)
New Rules On AC Using
ఏసీలకు సంబంధించి కేంద్రం కొత్త రూల్ తీసుకురానుంది. ఏసీ టెంపరేచర్ 20 నుంచి 28 డిగ్రీల మధ్య ఉండేలా సెట్టింగ్స్ తీసుకొస్తామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.యూజర్లు 20 కంటే తక్కువ 28 కంటే ఎక్కువ టెంపరేచర్ పెట్టలేరు. దీనివల్ల విద్యుత్ ఆదా అవడమే కాకుండా కర్బన ఉద్గారాలను తగ్గుతాయని చెప్పారు. ఈ రూల్ ను త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు.
अब 20 डिग्री से कम तापमान पर नहीं चला सकेंगे AC को#wether #airconditioner #summer #ModiGovernment pic.twitter.com/HKL78KCoxF
— ANews Office (@AnewsOffice) June 10, 2025
నియంత్రణ లేకుండా ఉంది..
దేశంలో చాలా ఆఫీసుల్లో, ఇళ్ళల్లో 20 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ ను పెడుతున్నారని మంత్రి ఖట్టర్ అన్నారు. దానికి కారణం ప్రస్తుతం కొన్ని ఏసీలు కనిష్ఠంగా 16 డిగ్రీలు, కొన్ని 18 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతతో వస్తున్నాయి. ఇకపై 20 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు. ఒక్కో డిగ్రీ సెల్సియస్ పెంచుకుంటూ వెళ్లడం వల్ల 6 శాతం మేర విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. ఏసీల వినియోగం తీరుతెన్నుల గురించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఓ సర్వే నిర్వహించింది. దాని ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.