Bomb Threats : సీఎం స్టాలిన్‌కు బాంబు బెదిరింపులు..చెన్నైలో హై అలర్ట్

తమిళనాడు చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపుల ఘటన కలకలం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) సహా పలువురు సినీ ప్రముఖులకు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడం చర్చనీయంశంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు.

New Update
CM Stalin

CM Stalin

Bomb Threats: తమిళనాడు చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపుల ఘటన కలకలం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) సహా పలువురు సినీ ప్రముఖులకు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడం చర్చనీయంశంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు.

 రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌తోపాటూ ప్రముఖ నటులు అజిత్‌ కుమార్, అరవింద్‌ స్వామి , ఖుష్బూ నివాసాలకు ఆదివారం రాత్రి బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దానికి సంబంధించి డీజీపీ కార్యాలయానికి ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు తెలిపారు. బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారి నివాసాల చేరుకొని విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీల నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదని తెలిసింది. దీంతో అది బూటకపు బెదిరింపుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

కాగా, తమిళనాడులోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు గత కొన్నిరోజులుగా వరుస బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, టీవీకే చీఫ్‌, ప్రముఖ నటుడు విజయ్‌, ప్రముఖ నటులు త్రిష, నయనతార, ప్రభు, రజినీకాంత్‌, ధనుష్‌, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా  స్టూడియోస్‌, బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌, చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ మెయిల్స్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ నివాసానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అయితే, అవన్నీ నకిలీ బెదిరింపులుగా అధికారులు తేల్చారు. కాగా ఈ నకిలీ బెదిరింపులపై పోలీసులు అప్రమత్తమయ్యారు.

Advertisment
తాజా కథనాలు