/rtv/media/media_files/2025/07/18/bomb-threats-2025-07-18-11-41-21.jpg)
దేశ రాజధాని ఢిల్లీతోపాటు బెంగుళూర్ నగరాల్లో శుక్రవారం పదుల సంఖ్యలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. అనేక స్కూళ్ల వద్ద స్క్వాడ్స్ ఉన్నాయి. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన స్కూళ్లలో సివిల్ లైన్స్లోని సెయింట్ గ్జావియర్స్, పశ్చిమ్ విహార్లోని రిచ్మండ్ గ్లోబల్ స్కూల్, రోహిణిలోని అభినవ్ పబ్లిక్ స్కూల్, ద సావిరిన్ స్కూల్ ఉన్నాయి.
🚨 #Delhi: Over 20 schools, including Modern International School (Dwarka) and The Sovereign School (Rohini), received bomb threats this morning. Delhi Police investigating. Students evacuated, search ops underway.
— Backchod Indian (@IndianBackchod) July 18, 2025
pic.twitter.com/7Qp1HEQPXV
సెయింట్ స్టీఫెన్స్ కాలేజీకి ఈరోజు ఉదయం 7.15 నిమిషాలకు ఈమెయిల్ వచ్చినట్లు పేర్కొన్నారు. స్కూల్ క్యాంపస్లో 4 ఐఈడీలు, 2 ప్యాకెట్ల ఆర్డీఎక్స్ అమర్చినట్లు బెదిరించారు. మధ్యాహ్నం రెండు గంటల లోపు అవి పేలనున్నట్లు మెయిల్ లో పేర్కొన్నారు.
Delhi and Bengaluru bomb threats: Over 20 schools in Delhi and around 40 private schools in #Bengaluru received bomb threat emails this week, causing significant panic and emergency response. Most threats were hoaxes, but authorities remain on alert.#delhibombthreat#bombthreat
— SGT Times (@SGTTimes) July 18, 2025
అలాగే బెంగుళూరులోని స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. సిటీలోని దాదాపు 40 ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. RR నగర్తో పాటు కేన్గిరిలో ఉన్న స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపు మెయిల్స్ రావడంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు.
Delhi Schools