Air India Plane Crash: విమాన ప్రమాదం.. బ్లాక్ కలర్‌ డీపీతో ఎక్స్‌లో ఎయిర్ ఇండియా సంతాపం

గుజరాత్‌లో అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. లండన్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విషాద ఘటనపై ఎయిరిండియా సంస్థ అధికారికి ఎక్స్‌లో డీపీని మార్చింది.

New Update
Air India profile pics go black after London-bound flight crashes in Ahmedabad

Air India profile pics go black after London-bound flight crashes in Ahmedabad

గుజరాత్‌లో అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. లండన్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విషాద ఘటనపై ఎయిరిండియా సంస్థ అధికారికి ఎక్స్‌లో డీపీని మార్చింది. బాధితులకు సంతాపం ప్రకటిస్తూ నలుపు రంగుతో డీపీ పెట్టింది. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ఎయిరిండియా ఫ్లైట్ మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరింది. 

కానీ పలు సాంకేతిక కారణాల వల్ల టేక్ ఆఫ్ అయి కొద్దిదూరం వెళ్లాక కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు ప్రయాణికులు, 10 మంది సిబ్బంది సహా 242 మంది ఉన్నారు. వీళ్లలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు ప్రయాణిస్తున్నారు. అలాగే ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ విచారం వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగతున్నాయి.  

Advertisment
Advertisment
తాజా కథనాలు