Air India Plane Crash: పెను విషాదం.. విమానాన్ని నడిపిన పైలట్లు వీళ్లే

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించింది. అయితే ఈ విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్, క్లైవ్ కుందర్‌.. ఈ ఇద్దరు పైలట్లు నడిపారు.

New Update
Ahmedabad plane crash, Who are the pilot and co-pilot of the Air India flight

Ahmedabad plane crash, Who are the pilot and co-pilot of the Air India flight

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్, క్లైవ్ కుందర్‌.. ఈ ఇద్దరు పైలట్లు నడిపారు. సుమీత్‌ సబర్వాల్‌ ఒక LTC (లైన్ ట్రైనింగ్ కెప్టెన్). ఈయనకు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. వీళ్లు ఇతర పైలట్‌లకు శిక్షణ ఇచ్చే అనుభవజ్ఞులు. అలాగే కో పైలట్‌.. క్లైవ్‌ కుందర్‌కు 1100 గంటలు నడిపిన అనుభవం ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు