/rtv/media/media_files/2025/06/08/WtaSOD648uWmuVcdwWef.jpg)
Padmanabha swamy temple
కేరళలో అనంతపద్మనాభి స్వామి దేశాలయం ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఈ గుడి వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే 270 ఏళ్ళుగా దీన్ని మూసేశారు. అయితే రీసెంట్ గా ఆ ఆలయాన్ని మళ్ళీ తెరిచారు. దాంతో పాటూ 270 ఏళ్ళ తర్వాత అనంత పద్మనాభ స్వామి ఈరోజు మహాకుంభాభిషేకమ్ నిర్వహించారు. దీనిలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఈ విగ్రహం కూడా 300 ఏళ్ళ నాటిది. కటు సర్కార యోగం అనే పద్ధతిలో దీన్ని తయారు చేశారని చెబుతున్నారు. ప్రధాన ఆలయ ఆవరణలోని తిరువంబడి శ్రీ కృష్ణ ఆలయం వద్ద అష్టబంధ కలశాన్ని ఉంచారు.
Kerala | Sree Padmanabhaswamy Temple holds 'Maha Kumbhabhishekam' after 270 years. The ceremony will include the dedication of the domes in front of the main shrine, the re-installation of the Vishwaksena idol, and the ‘Ashtabandhakalasam’ ritual at the Thiruvambady Sree… pic.twitter.com/LGxzcUQu7c
— ANI (@ANI) June 8, 2025
ట్రావెన్ కోర్ కుటుంబం ప్రత్యేక పూజలు..
అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని కేరళలోని ట్రావెన్ కోర్ సంస్థానం చూస్తుంది. అందుకే కుంభాషేకం ముందు ఈ వంశానికి చెందిన మూలమ్ తిరునాల్ రామ వర్మ కుటుంబానికి చెందిన సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ విశ్వనాథ్ రాజేంద్ర అలేఖర్ కూడా హాజరయ్యారు. ఆలయం పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశిస్తూ 2017లో సుప్రీం కోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచే ఆలయ బాగోగుల పనులు మొదలైనప్పటికీ కోవిడ్ కారణంగా అవి ఆగిపోయాయి. కోవిడ్ అనంతరం దశలు దశలుగా పని చేస్తూ ఇప్పటికి పూర్తి చేశారు.
Also Read : అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు