మణిపూర్ (Manipur) కోసం ప్రధాని మోదీ ఏం చేశారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు.బీజేపీ (BJP) భావజాలమే మణిపూర్లో (Manipur) మంటలకు కారణమైందని ఇదంతా మోదీకి (Modi) తెలుసని వ్యాఖ్యానించారు.జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్లో విపక్ష కూటమి ‘ఇండియా’ ఎంపీలు (INDIA MP’s) ఈనెల 29,30 తేదీల్లో పర్యటించనున్నారు. 20 మంది ఎంపీలతో కూడిన ప్రతినిధుల బృందం మణిపూర్లో పర్యటించి అక్కడి పరిస్థితి తెలుసుకోనుందని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) వెల్లడించారు. గతంలోనూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మణిపూర్ను సందర్శించాలని భావించినా అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వారికి అనుమతి లభించలేదన్నారు. రాహుల్ గాంధీ మాత్రం మణిపూర్లో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు.విపక్ష కూటమి ఇండియాలో మొత్తం 26 పార్టీలు (26 Parties) ఉన్నాయి.మణిపుర్ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్లో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.ఇప్పటికే మోదీ సర్కారుపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ (MP Gourav Gogoi) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓంబిర్లా దానికి అనుమతి ఇచ్చారు.
పూర్తిగా చదవండి..అధికారం కోసం మణిపూర్లో మంటలు : BJP,RSSపై రాహుల్ ఫైర్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మూడు నెలలుగా జాతి ఘర్షణలు కొనసాగుతున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.అధికారం కోసం బీజేపీ మణిపూర్ను తగులబెట్టేందుకు సిద్దమవుతోందని విమర్శించారు.అలాగే మణిపూర్లో హింసపై బీజేపీకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదంటూ మండిపడ్డారు.ఇదే అంశంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికీ నోటీసు ఇచ్చామని తెలిపారు.
Translate this News: