MS Dhoni: మళ్ళీ సస్పెన్స్ పోస్ట్ పెట్టిన ధోనీ..ఈసారి దేని గురించో!

ఇండియా మాజీ మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ మళ్ళీ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కొత్త సీజన్...కొత్తపాత్ర.. వెయిట్ చేయలేకపోతున్నా..చూస్తూ ఉండండి అంటూ అందులో రాశాడు. ఇంతకు ముందు కూడా ధోనీ ఇలాంటి పోస్ట్‌లను పెట్టాడు.

MS Dhoni: మళ్ళీ సస్పెన్స్ పోస్ట్ పెట్టిన ధోనీ..ఈసారి దేని గురించో!
New Update

Dhoni Social Media Post 'New Season New Role' Goes Viral: మహేంద్ర సింగ్ ధోని..భారత్‌ కు వరల్డ్‌ కప్‌ను అందించిన మిస్టర్ కూల్ కెప్టెన్. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్‌లో (IPL) తప్ప క్రికెట్ ఆడటం లేదు. మిగతా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిపోయాడు. కానీ ధోని తన అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటాడు. క్రికెట్ ఆడడం మానేసినా..యాడ్స్ చేయడం మాత్రం మానలేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతుంటాడు. దాంతో పాటూ సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తూ పోస్ట్‌లను పెట్టడం ధోనీకి అలవాటు. కొన్ని రోజుల్లో ఇది చేస్తా...నా జీవితంలోకి కొత్తది రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో హల్ ఛల్ చేస్తాడు మిస్టర్ కూల్. తర్వాత తీరిగ్గా తను చేస్తున్న యాడ్ గురించో...లేదా ఇంక దేని గురించో చెప్పాను అంటూ మరో పోస్ట్ పెడతాడు. ధోనీ అభిమానులకు ఇదంతా అలవాటే.

ఇప్పుడు తాజాగా ఇలాంటిదే ఒకటి పోస్ట్ చేశాడు ధోనీ. కొత్త సీజన్..కొత్త పాత్ర..వెయిట్ చేయడం నా వల్ల కావడం లేదంటూ పోస్ట్ చేశాడు. అదేంటో మీరూ చూస్తూ ఉండండి అంటూ రాశాడు. దీంతో ధోనీ అభిమానులు ఊహల్లో పడిపోయారు. త్వరలో ఐపీఎల్ రాబోంది కాబట్టి దానికి సంబంధించి వార్త అయి ఉంటుందేమో అని ఊహిస్తున్నారు. 2024 తర్వాత ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని...లేదా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మెంటార్‌గా మారతాడని ఇలా ఏవేవో అనుకుంటున్నారు. అదీ కాకపోతే మళ్ళీ చెన్నై జట్టుకు ఇంకెవరినైనా కెప్టెన్‌గా చేస్తాడేమో...ఆ వార్తనే చెబుతాడేమో అని కూడా అనుకుంటున్నారు.

Dhoni Social Media Post 'New Season New Role' Goes Viral

అయితే ఇంతకు ముందు కూడా ధోనీ అభిమానులను ఊఱించి ష్ట్రరించి చివరకు ఓరియో బిస్కట్ల యాడ్ అని చెప్పి తుస్సుమనిపించాడు. అప్పుడు కూడా అభిమానులు కెప్టెన్ కూల్ ఏం చెబుతాడా అని తెగ ఊహించేసుకున్నారు.కానీ చివరకు యాడ్ గురించి అనౌన్స్ చేశాడు. ఇప్పుడు కూడా అలాంటి ట్రిక్కే అయి ఉండవచ్చునని అంటున్నారు కొందరు. ఒకటి, రెండు రోజుల తర్వాత ధోనీ మరో యాడ్ గురించి చెబుతాడేమో అని అనుంటున్నారు. కానీ మొత్తానికి ధోనీ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతను చెప్పే వార్త కోసం అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.

Also Read:Karnataka: ముగ్గురు అమ్మాయిల మీద యాసిడ్ దాడి..ఎంబీఏ స్టూడెంట్ నిర్వాకం

#cricket #ms-dhoni #ipl-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe