చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదు... మంత్రి నాగార్జున ఫైర్...!

చంద్రబాబు మెంటల్ ఇన్ బ్యాలెన్స్ లో వున్నారని మంత్రి నాగార్జున అన్నారు. 14 సంవత్సరాల కాలంలో అదికారాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు కోట్లు దండుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సంపాదనే ధ్యేయంగా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. అందుకే సీఎం జగన్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పారు.

New Update
చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదు... మంత్రి నాగార్జున ఫైర్...!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు మెంటల్ ఇన్ బ్యాలెన్స్ లో వున్నారని ఆయన అన్నారు. టీడీపీ అధినేత సహా ఇతర నేతల ఆలోచనలు వెర్రితలలు వేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. అందుకే పోలీసులపై రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపించారు.

14 సంవత్సరాల కాలంలో అదికారాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు కోట్లు దండుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సంపాదనే ధ్యేయంగా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. అందుకే సీఎం జగన్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కుయుక్తులను నమ్మే స్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు.

జగన్ రథ చక్రాలకింద టీడీపీ విలవిల లాడుతుందన్నారు. ఈ రాష్ట్రానికి జగన్ పాలన అవసరం అని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని సీఎం జగన్ తపన పడుతున్నారన్నారు. అందుకే మరోసారి సీఎం జగన్ కు పట్టం కట్టాలని ప్రజలు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం తరఫున విడుదల చేస్తున్న ప్రతి పైసా కూడా రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఇంటిని తడుతుందన్నారు.

రాష్ట్రంలో ఓట్ల వ్యవహారం తప్పుల తడకలాగా వుందన్నారు. కొంతమందికి రెండు చోట్ల ಓట్లు వున్నాయన్నారు. దొంగ ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తామన్నారు. ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్ చూసుకుంటదన్నారు. వేమూరులో సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. అక్కడ తన మాటలను వక్రికరించారన్నారు. రాష్ట్రంలో అరవై లక్షల దొంగ ಓట్లు ఉన్నాయన్నారు. కుప్పంలో దొంగ ಓట్లతో గెలుస్తున్నారని ఆరోపించారు. ‌

Advertisment
తాజా కథనాలు