అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్.. ప్రధాని మోదీ కామెంట్స్‌కి మైండ్ బ్లాంక్ కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..

కేటీఆర్.. ప్రధాని చేసిన ఒక్కో కామెంట్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. దేశం మార్పు కోరుకుంటోందని అన్నారు. జాతీయ స్థాయిలో అధికార మార్పిడీ జరగాలని దేశం కోరుకుంటోందని అన్నారు కేటీఆర్.

New Update
అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్.. ప్రధాని మోదీ కామెంట్స్‌కి మైండ్ బ్లాంక్ కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..

Minister KTR Slams BJP: బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్ తీవ్రంగ ఆస్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. ప్రధాని చేసిన ఒక్కో కామెంట్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. దేశం మార్పు కోరుకుంటోందని అన్నారు. జాతీయ స్థాయిలో అధికార మార్పిడీ జరగాలని దేశం కోరుకుంటోందని అన్నారు కేటీఆర్. అంతేకాదు. బీఆర్ఎస్‌ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందంటూ ప్రధాని చేసిన కామెంట్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ స్టీరింగ్ అదాని చేతిలో ఉందంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇలా పాయింటు పాయింట్ రైజ్ చేస్తూ.. ప్రధాని ఏమేం అన్నారో అన్నింటి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

మంత్రి కేటీఆర్ ట్వీట్ సారాంశం ఇదీ..

'నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు. BRS పార్టీ స్టీరింగ్ కేసీఆర్ గారి చేతిలోనే పదిలంగా ఉంది.కానీ బిజెపి స్టీరింగ్.. అదాని చేతిలోకి వెళ్లిపోయింది. మీరు కిసాన్ సమాన్ కింద ఇచ్చింది కేవలం నామమాత్రం.. కానీ ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ.. కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు రూ. 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం మీరు తెలుసుకుంటే మంచిది. రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం.. మిలియన్ డాలర్ జోక్. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం తెలంగాణలోనే ఆవిష్కృతమైంది. అన్నదాతల అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం మాది..! కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన.. నై కిసాన్ సర్కారు మీది.! కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం మీది..! పదేళ్లపాటు విభజన హామీలను పాతరేసి.. మీ ఎన్నికల హామీలను గాలికి వదిలేసి.. ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరు. ప్రాజెక్టులు వల్ల చుక్క నీరు రాలేదనడం.. మీ అవివేకానికి నిదర్శనం. తెలంగాణలో సాగుతోంది సాగునీటి విప్లవం. తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరా మాట్లాడేది. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న మీ కేంద్ర పెద్దల అవమానకర మాటలు తెలంగాణ రైతులు మరిచిపోలేదు. మీరు ఎన్ని చెప్పినా.. మీ బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి. నిన్న కాళేశ్వరం అయినా.. నేడు పాలమూరు ప్రాజెక్టు అయినా.. ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత అద్భుతాలు. భవిష్యత్తు ఇరిగేషన్ రంగానికే సరికొత్త పాఠాలు. వీటిపై మీ ఆరోపణలు.. పూర్తిగా అవాస్తవాలు.' అంటూ మంత్రి కేటీఆర్ ట్వీ్ట్ చేశారు.

Also Read:

Telangana: అన్నీ చిలుక పలుకులే.. కొత్తగా ఆయన ఇచ్చేదేంది?.. ప్రధాని మోదీపై హరీశ్ రావు మార్క్ సెటైర్స్..

PM Modi: ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌పై నెక్ట్స్ లెవల్‌ పంచ్‌లు..

Advertisment
తాజా కథనాలు