Anantapur: అనంతపురంలో 'ఠాగూర్' మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!!

కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ (32)కి అనంతపురంలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంతవరకూ వారికి పిల్లలు కలగ లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్‌ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మ బలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్‌ బీని ఆపరేషన్‌ థియేటర్ ‌కు తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లే ముందే మోదీన్ బీకి ఓ మందు ఇవ్వగా.. అది వికటించి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది.

Anantapur: అనంతపురంలో 'ఠాగూర్' మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!!
New Update

Megastar Tagore Hospital Scene Repeat in Anantapur Private Hospital: మెగాస్టార్ చిరంజీవి నటించి 'ఠాగూర్' సినిమాలోని కొన్ని సీన్లు అలా గుర్తిండిపోతాయి. అందులో ఒకటి ఆస్పత్రిలోని సీన్. ఈ సీన్.. ఎన్నో కార్పొరేట్ ఆస్పత్రులకు చమటలు పెట్టిందింది. ఈ సినిమాలోని ఉన్న కొన్ని సీన్లు నిజ జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. అందులో ఆస్పత్రిలోని సీన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చనిపోయిన వ్యక్తి బ్రతికే ఉన్నాడని నమ్మించి, కొన్ని గంటల పాటు చికిత్స చేసి.. లక్షల రూపాయలు గుంజుకోవడానికి నాటకం ఆడారు. సరిగ్గా అలాంటి సీనే తాజాగా అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. చనిపోయిన మహిళ బ్రతికే ఉందని నాలుగు గంటల పాటు ఓ ఆస్పత్రి సిబ్బంది నాటకం ఆడారు. సీన్ కట్ చేస్తే.. అసలు విషయం బయట పడింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ (32)కి అనంతపురంలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంతవరకూ వారికి పిల్లలు కలగ లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్‌ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మ బలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్‌ బీని ఆపరేషన్‌ థియేటర్ ‌కు తీసుకెళ్లారు.

లోపలికి తీసుకెళ్లే ముందే మోదీన్ బీకి ఓ మందు ఇవ్వగా.. అది వికటించి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది. ఈ విషయం తెలిస్తే కుటుంబ సభ్యులు నానా రాద్ధాంతం చేస్తారని భయపడి.. గంటపాటు అలానే ఉంచారు. ఆ తర్వాత లోపలికి పిలిచి.. మోదీన్‌ బీకి మూర్ఛ వచ్చిందని, పరిస్థితి చాలా సీరియస్‌ గా ఉందని, వెంటనే బెంగళూరుకు తీసుకొని వెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఆమె బ్రతికే ఉందని నమ్మించేందుకు.. ఆక్సిజన్‌ ను కృత్రిమంగా పంపింగ్‌ చేస్తూ నాటకం ఆడాడు. ఇలా 4 గంటల పాటు ఆ మహిళ మృతి చెందిన విషయం చెప్పకుండా ఆపరేషన్‌ థియేటర్‌ లోనే ఉంచేశారు.

ఇక పరిస్థితి చెయ్యి దాటిపోయిందనుకున్న ఆసుపత్రి సిబ్బంది.. రాత్రి 7:45 గంటలకు సేఫ్టీ కోసం పోలీసుల్ని పిలిపించి, మోదీన్‌ బీ చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతురాలు గుత్తి మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ వన్నూరమ్మ మేనకోడలు కావడంతో.. బంధువులు పెద్దఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. ఆసుపత్రిలోని ఐసీయూ గదిని ధ్వంసం చేయడంతో పాటు అద్దాలు పగులకొట్టారు. వైద్యులు, పోలీసులపై కూడా ఎటాక్ చేశారు. చివరికి సీఐలు, ఎస్సైలు రంగంలోకి దిగి.. పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఆసుపత్రిని సీజ్‌ చేయాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.

#megastar-chiranjeevi #anantapur #crime-news #hospital-scene-repeat #tagore-movie #crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి