Chiranjeevi : రేపే చిరంజీవికి పద్మవిభూషణ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మవిభూషణ్ పురష్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురష్కారాన్ని స్వీకరించేందుకు చిరంజీవి కుటుంబ సమేతంగా గురువారం ఢీల్లి వెళ్లనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకోబోతున్నారు.

Chiranjeevi : రేపే చిరంజీవికి పద్మవిభూషణ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న మెగాస్టార్!
New Update

Chiranjeevi Going To Delhi : టాలీవుడ్(Tollywood) సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇటీవలే చిరంజీవి పై ఓ మాసివ్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. ఇదిలా ఉంటే చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్ కి చిన్న గ్యాప్ ఇవ్వబోతున్నారట. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఢిల్లీ(Delhi) వెళ్లనున్నట్లు తాజా సమాచారం.

Also Read : వైరల్ అవుతున్న మెగా డాటర్ న్యూ టాటూ.. ఏకంగా ఆ పార్ట్ మీద..

ఢీల్లికి వెళ్తున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ(Cine Industry) కు చిరు అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించనుంది. కాగా ఈ పురష్కారాన్ని స్వీకరించేందుకు చిరంజీవి కుటుంబ సమేతంగా రేపు (గురువారం) ఢిల్లీ వెళ్లనున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం(Padma Vibhushan Award) అందుకోబోతున్నారు. రామ్ చరణ్, ఉపాసన సైతం ఈ వేడుక కోసం ఢిల్లీ వెళ్తారని తాజా సమాచారం. ఈ మూమెంట్ కోసం మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటూ ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

#chiranjeevi-padma-vibhushan #south-cine-industry #chiranjeevi #megastar-chiranjeevi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి