Viral: మంచు మనోజ్ దంపతులకు కవల పిల్లలు.. పోస్ట్ వైరల్!

కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారంటూ వైరల్ అవుతున్న వార్తపై మంచు మనోజ్ స్పందించాడు. 'మాకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి రూమర్స్‌ నమ్మకండి. మే నెలలో మా ఇంటికి బిడ్డ రాబోతుంది. అందరికీ ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశాడు.

New Update
Viral: మంచు మనోజ్ దంపతులకు కవల పిల్లలు.. పోస్ట్ వైరల్!

Manchu manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనిక దంపతులకు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. మౌనిక కవల పిల్లలకు జన్మనివ్వబోతుందంటూ నెట్టింట నెటిజన్లు హంగామా చేస్తున్నారు. దీంతో తాజాగా స్పందించిన మనోజ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

వార్తల్లో నిజం లేదు..
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా దీనిపై పోస్ట్ పెట్టిన మనోజ్.. 'దయచేసి మా విషయంలో మీరు ఎలాంటి రూమర్స్‌ నమ్మకండి. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం. మాకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం తన భార్య మౌనిక ఏడో నెల గర్భంతో ఉంది. ఈ ఏడాది మే నెలలో మా ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, అప్యాయత, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ మనోజ్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇది కూడా చదవండి: TS: కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలింది.. సీఎం రేవంత్!

2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. గతేడాది మౌనికను పెళ్లాడిన మనోజ్ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. ఇద్దరికి ఇది రెండో పెళ్లి కావడం విశేషం.

Advertisment
తాజా కథనాలు