సాయంత్రం లోపు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం.. ఖర్గే

తెలంగాణలో సీఎం అభ్యర్థి ఎవరూ అనే ఉత్కంఠకు ఈరోజు తెరపడనుంది. ఇవాళ సాయంత్రం లోపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తెలిపారు. డికే శివకుమార్ బృందంతో సహా భట్టి, ఉత్తమ్‌ ఈరోజు మధ్యాహ్నం ఖర్గేతో సమావేశం కానున్నారు.

New Update
BREAKING: 'INDIA'కూటమి చైర్‌పర్సన్‌గా ఖర్గే..!

తెలంగాణలో సీఎం అభ్యర్థి ఎవరూ అనే సస్పెన్స్‌కు ఈరోజు తెరపడనుంది. ఇవాళ సాయంత్రం లోపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తెలిపారు. అయితే ఇప్పటికే డీకే శివకుమార్‌ బృందం ఢిల్లీకి వెళ్లింది. తాజాగా భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా హుటాహుటీనా ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం నాటికి వీళ్లు పార్టీ హైకమాండ్‌తో సమావేశం కానున్నారు. అయితే డీకే శివకుమార్ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా అదిష్ఠానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణకు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ.. లోక్‌సభలో బిల్లు

Advertisment
తాజా కథనాలు