/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-07T195446.049-jpg.webp)
Guntur Kaaram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం గుంటూరు కారం(Guntur Kaaram). ప్రస్తుతం మహేష్ బాబు ఫోకస్ అంతా ఈ సినిమా పైనే పెట్టారు. మేకర్స్ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12 పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గుంటూరు కారం సంక్రాంతి బరిలో ఉన్నందున చిత్ర బృదం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ రాబోతున్న మాస్ యాక్షన్ మసాలా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో త్రివిక్రమ్ మహేష్ బాబును కొత్త లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారంలో మహేష్ బాబు(Mahesh Babu) సరసన శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి కనిపించనున్నారు.
Also Read: OTT Release: మూవీ లవర్స్ని కిక్కెక్కించే సినిమాలు.. ఓటీటీలో కొత్త రిలీజ్లు ఇవే!
ఇటీవలే మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'దమ్ మసాలా' సాంగ్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ 30 మిలియన్ వ్యూస్ పైగా సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ సినిమాలోని ఒక పాటను చిత్రీకరించడం కోసం కేరళ వెళ్లినట్లు చెబుతున్నారు.
Also Read: Daggubati Abhiram Wedding: శ్రీలంకలో ఘనంగా.. దగ్గుబాటి అభిరామ్ డెస్టినేషన్ వెడ్డింగ్..!