Weight loss Tips: డైలీ ఈ టిప్స్ పాటిస్తే.. నెల రోజుల్లో హెవీ వెయిట్ లాస్.. ఎలాగంటే?

నెల రోజుల్లో ఈజీగా బరువు తగ్గాలంటే పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా మైదా, చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటితో పాటు రోజుకు సరిపడా అనగా 8 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. అప్పుడే ఊబకాయం సమస్య నుంచి బయటపడతారని నిపుణులు అంటున్నారు.

New Update
Weight Loss

weight loss

ప్రస్తుతం రోజుల్లో చాలా మందికి ఊబకాయం సమస్య ఇబ్బంది పెడుతోంది. ఫాస్ట్ ఫుడ్, మసాలా వంటివి తీసుకోవడం వల్ల బాడీలో కొవ్వు పెరిగిపోతుంది. ఇలా ఊబకాయం వచ్చిందంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, హైబీపీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు వీటిని తగ్గించుకోవడానికి మందులు కూడా వాడుతుంటారు. అయితే ఊబకాయం అనేది దీనివల్ల తగ్గదు. జీవనవైలి, ఆహారంలో మార్పులు ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. దీనికోసం  మీరు పోషకాలు ఉండే ఫుడ్స్ తీసుకోవడంతో పాటు వ్యాయామం వంటివి చేయాలి. అలాగే మరికొన్ని టిప్స్ పాటిస్తే తప్పకుండా ఊబకాయం సమస్య నుంచి బయటపడతారు. కేవలం నెల రోజుల్లోనే మీరు ఈజీగా బరువు తగ్గుతారు. ఎలాగో మీకు తెలియాలంటే ఈ స్టోరీపై లుక్కేయాల్సిందే.

అల్పాహారం

కొందరు ఉదయం టిఫిన్ అసలు తీసుకోరు. ఒకవేళ తీసుకున్న ఎలాంటి పోషకాలు లేని ఫుడ్స్ తీసుకుంటారు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్స్ తీసుకుంటారు. వీటివల్ల ఊబకాయం పెరుగుతుంది. అదే మీరు ప్రొటీన్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రొటీన్ వల్ల కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. ఈజీగా వెయిట్ లాస్ కావచ్చని నిపుణులు అంటున్నారు. 

ధాన్యాలు
ఎక్కువగా తృణ ధాన్యాలు తీసుకుంటే బాడీకి బలం అందుతుంది.  డ్రైఫూట్స్, నట్స్, ఓట్స్ వంటి పోషకాలు ఉండేవి తీసుకోవాలి. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు ప్రొటీన్ అధికంగా ఉండే గుడ్లు వంటివి కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

చక్కెర
చక్కెర తినకపోతే సగం అనారోగ్య సమస్యలు తగ్గినట్లే. ఒక  నెల రోజుల పాటు చక్కెరకు దూరంగా ఉంటే మాత్రం తప్పకుండా ఊబకాయం సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఊబకాయంతో పాటు డయాబెటిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

మైదా పదార్థాలు
మైదాతో తయారు చేసే పదార్థాలు అసలు తీసుకోకూడదు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి పోషకాలు కూడా ఉండవు. వీటివల్ల ఈజీగా బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. ఈ మైదా వల్ల ఎలాంటి పోషకాలు కూడా అందవు. తొందరగా అనారోగ్య సమస్యల బారిన పడతారు. మైదా తొందరగా జీర్ణం కూడా కాదు. దీంతో కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు.

రాత్రి భోజనం
రాత్రి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిపూట తప్పకుండా 7:30 గంటల లోపు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల కొంతవరకు ఊబకాయం సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు.

మంచి నిద్ర
బరువు తగ్గడానికి ఫుడ్ విషయంలో రూల్స్ పాటించినట్లు నిద్ర విషయంలో కూడా పాటించాలి. బాడీకి సరిపడా నిద్ర ఉంటేనే ఈజీగా బరువు తగ్గుతారు. లేకపోతే ఊబకాయం సమస్య ఇంకా పెరుగుతారు. డైలీ తప్పకుండా 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు